`బావా… బావా…` అంటూ మల్లేశం చిత్రంలో ప్రియదర్శితో పోటాపోటీగా నటించిన తెలుగు పడుచు అనన్య నాగళ్ల. మొదటి సినిమా `మల్లేశం`తో మంచి పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు తాజాగా రెండో సినిమాకు సంతకం చేసింది. ఈ తాజా సినిమాకు దర్శకుడు హరిప్రసాద్ జక్కా. ఆయన ఇంతకు ముందు `దర్శకుడు` అనే సినిమా చేశారు. అంతకుపూర్వం సుకుమార్ దగ్గర ఆయన రైటింగ్ డిపార్ట్ మెంట్లో పనిచేశారు. `ఒన్ నేనొక్కడినే`, `100 పర్సెంట్ లవ్` చిత్రాలకు ఆయన రచయిత. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి `ప్లే బ్యాక్` అనే పేరు పెట్టారు. ఓ పాడు పడిన బంగ్లాలో ఈ నెల 5 నుంచి షూటింగ్ చేయనున్నారు. నాయికగా అనన్యను ఎంపిక చేసుకున్నారు. స్క్రీన్ప్లే బేస్ అయిన థ్రిల్లర్గా ప్లే బ్యాక్ను రూపొందించనున్నారు. హుషారు సినిమా ఫేమ్ దినేష్ తేజ్ ఇందులో నటిస్తున్నారు. 90ల నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. రెండో సినిమా పకడ్భంధీగా ఉండాలని హరిప్రసాద్ జక్కా స్క్రిప్ట్ మీద ఎక్కువగా వర్క్ చేశారట. రెండో సినిమా విషయంలో అనన్య కూడా ఎగ్జయిటింగ్గా ఉందని వినికిడి.
previous post
next post