Aadavallu Meeku Johaarlu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ లుగా కొనసాగుతున్న వాళ్లు పూజా హెగ్డే, రష్మిక మందన, సాయి పల్లవి, కీర్తి సురేష్. దాదాపు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సినిమాకి సంబంధించిన హీరోయిన్ పాత్రలు ఈ నలుగురికే ఎక్కువగా దకుతున్నాయి. చాలా వరకు పూజా హెగ్డే ప్రారంభంలో అవకాశాలు బాగా అందుకోగా ఆ తర్వాత రష్మిక మందన అందుకుంటూ ఉంది. ఇక ఇదే సమయంలో ఇటీవల కొన్ని నెలల నుండి.. సాయి పల్లవి, కీర్తి సురేష్ కూడా భారీ ప్రాజెక్టు అవకాశాలు అందుకుంటున్నారు.
కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” లో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చిరంజీవి “భోళాశంకర్” సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క సాయిపల్లవి కూడా “శ్యామ్ సింగరాయి”.. వంటి వాటిలో నటించగా ఇప్పుడు మరి కొన్ని కీలక ప్రాజెక్ట్ లు చేస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీలో మంచి పోటీ హీరోయిన్ల మధ్య ఉండగా తాజాగా కీర్తి సురేష్, సాయి పల్లవి … తోటి స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కోసం రంగంలోకి దిగారు.
ఈ సినిమా ట్రైలర్ వేడుక రేపు హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగనుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముఖ్య అతిథులుగా సాయిపల్లవి, కీర్తి సురేష్ బరిలోకి దిగుతున్నారు. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తన కెరియర్ లోనే ఇది బెస్ట్ సినిమా అని .. స్టోరీ వింటున్నంత సేపు ఫ్లోర్ మీద పడి నవ్వుతూ ఉన్నట్టు రష్మిక మందన చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో రష్మిక మందన తో పాటు శర్వానంద్ ముఖ్యపాత్ర పోషించాడు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!