Aacharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఆచార్య ఏప్రిల్ నెలలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఏ పరంగా కూడా అభిమానులను అలరించ లేకపోయింది. చరణ్ చిరంజీవి కలర్ డి ఫుల్ లెన్త్ గా సినిమాలో నటించడంతో ఉన్న అంచనాలు పెట్టుకొని థియేటర్ కి వచ్చిన అభిమానులకు… సినిమాలో ఏ భాగం కూడా అలరించిన పరిస్థితి కనబడలేదు. పైగా ఒక్క ఫ్లాప్ కూడా అప్పటివరకు లేని డైరెక్టర్ కొరటాల ఈ సినిమా చేయడంతో ఖచ్చితంగా ఆచార్య హిట్ అవుతుందని అనుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ సినిమా దారుణంగా పరాజయం పాలైంది. తద్వారా నిర్మాతలు..డిస్ట్రిబ్యూటర్ లు బాగా నష్టపోయినట్లు టాక్ కూడా వచ్చింది. అసలు కొరటాల శివ తీసిన సినిమా మాదిరిగా “ఆచార్య” లేదు అని చాలామంది పేర్కొన్నారు. దీంతో “ఆచార్య” రిజల్ట్ తో మెగాస్టార్ చిరంజీవి జాగ్రత్త పడినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాలు “ఆచార్య” విడుదల అవ్వక ముందే ఒప్పుకున్న సినిమాలు. అయితే కొత్తగా ఇప్పుడు మాత్రం సినిమా సెలక్షన్ విషయంలో చిరంజీవి చాలా ఆచితూచి ఆలోచనలు చేస్తున్నారట.
దీనిలో భాగంగానే తాజాగా కుర్ర డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమాని చిరంజీవి పక్కన పెట్టినట్లు టాక్. ఇప్పటివరకు రెండు సార్లు వెంకీ కుడుముల చిరంజీవికి స్టోరీ వినిపించినట్లు.. అయితే ఆచార్య రిజల్ట్ తో ప్రయోగాలకు వెళ్లకూడదని వెంకీ కుడుముల ప్రాజెక్ట్ చిరంజీవి పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య… సినిమాలు చేస్తున్నరు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!