Adi Purush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్ లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. కృష్ణంరాజు కార్యం 11 రోజులు ముగియడంతో.. ప్రభాస్ యధావిధిగా తన సినిమా షూటింగ్లలో పాల్గొంటూ ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలలో మొదట “ఆది పురుష్” విడుదల కానుంది. వచ్చే సంక్రాంతి పండుగకు జనవరి నెలలో రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెరియర్ లో ఫస్ట్ టైం బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆది పురుష్” పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కృతి సనన్ నటించింది. ఇంకా విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించడం జరిగింది. భారీ బడ్జెట్ తో షూటింగ్ జరుపుకుంటున్న “ఆది పురుష్” సినిమా టీజర్.. దసరా కానుకగా అక్టోబర్ రెండవ తారీకు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఈ వేడుకను చాలా ఘనంగా నిర్వహించడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. ఇందుకుగాను అక్టోబర్ రెండవ తారీకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో “ఆది పురుష్” టీజర్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది.
అయోధ్యలో “ఆది పురుష్” టీజర్ రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ గా ఏర్పాటు చేస్తుండగా.. ఈ వేడుకను కవర్ చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల జర్నలిస్టులను చిత్ర యూనిట్ ఆహ్వానించినట్లు సమాచారం. “ఆది పురుష్” టీజర్ రిలీజ్ అనంతరం ఢిల్లీలో జరిగే రావణ దహన కార్యక్రమానికి కూడా ప్రభాస్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోనున్నారట. విజయదశమి సందర్భంగా రామలీల మైదానంలో ప్రతి ఏడాది రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి కార్యక్రమానికి కృష్ణం రాజుతో పాటు ప్రభాస్ నీ ఆహ్వానించడం జరిగింది కానీ అనూహ్యంగా కృష్ణం రాజు మరణించడంతో ప్రభాస్ హాజరుకానున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!