ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రం `నిశ్శబ్దం`. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. సుప్రసిద్ధ నాయిక అనుష్క శెట్టి నటిగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా `నిశ్శబ్దం`’ టైటిల్ ప్రచార చిత్రం విడుదల చేశారు నిర్మాతలు.
అమెరికా సియాటల్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్లోనే జరగనుంది. చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల, కోన వెంకట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ, మలయాళం భాషల్లో ఈ సంవత్సరం చివరిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుందర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీరజ కోన, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్రఫీ – షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంకట్, స్టోరీ & డైరెక్షన్ – హేమంత్ మధుకర్;
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!