Samantha: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటుంది. దీంతో సమంత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మయోసైటిస్తో బాధపడుతూ తగిన చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి మెల్లగా కోలుకుంటున్న సమంత గత ఏడాది చివరిలో పలు దేశాలు తీరుగుతూ మానసిక, శారీరక ఆరోగ్యంపై స్పెషల్ ఫోకాస్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి తన ఫౌండేషన్కు సంబంధించిన పనులను చూసుకున్నారు. అదేవిదంగా సొంత నిర్మాణ సంస్థ ప్రకటించడం కరిగింది. కెరియర్ పరంగా “ఖుషీ” తర్వాత సమంత మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు.
ఇదిలా ఉండగా సమంత బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ ఒకే చేసిన్నట్లు మొన్నటివరకు ప్రచారం జరిగింది. అయితే ఇంతలోనే సోషల్ మీడియాలో సమంతా పెట్టిన ఓ పోస్ట్ ఫ్యాన్స్ నీ టెన్షన్ పెట్టింది. సమంత తన ఫిట్నెస్పై చాలా శ్రద్ధ చూపుతుందని అందరికి తెలిసిందే. ఈ క్రమంలో సమంత ఎప్పటికప్పుడు వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగానే లేటెస్ట్ గా మరో పోస్ట్ చేయడంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విషయంలోకి వెళ్తే ఓజోన్ థెరపీ అనే చికిత్స గురించి సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో స్క్రీన్షాట్ను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో చూసి సమంత ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని మయోసైటిస్ సమస్యతో బాధపడుతోందని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.
సమంత ఆరోగ్యం బాగుండాలని, ఆమె మళ్లీ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నరు. ఈ తరుణంలో సమంతకు భవిష్యత్ ప్రాజెక్ట్ ల మీద అసలు ఏమైనా ప్లాన్ ఉందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలవుతున్నాయి. విజయ్ దేవరకొండతో చేసిన “ఖుషి” తర్వాత సమంతకు చాలా అవకాశాలు వచ్చినా.. అనారోగ్య కారణాలతో నిర్మాతలకు అడ్వాన్స్ని తిరిగి ఇచ్చేసింది. ఈ క్రమంలో మళ్లీ ఇప్పుడు ఓజోన్ థెరపీ చికిత్స ఫోటో సమంత షేర్ చేయడంతో ఆమె వ్యాధి మళ్లీ తిరగబడిందేమో అని టెన్షన్ పడుతున్నారు. అందువల్లే ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదేమో అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!