బిగ్ బాస్ ఎంతో మంది అంచనాలకు మించి ముందుకు దూసుకుపోతున్న రియాల్టీ షో… ఎంతో ప్రేక్షాకాధరనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్.. ఎందరో కంటెస్టెంట్ లు ప్రజలముందుకు తీసుకొచ్చిన టాస్క్ లు, ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది బిగ్ బాస్ షో. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల నుంచి కూడా ఈ షోకు వారిని పరిచయం చేస్తూ వారి టాలెంట్ ను బయటపెడుతూనే ఉంది ఈ షో..
ఎన్నో ఉత్కంటలు, ఎన్నో ట్విస్టులు, ఎంతో ఎంటర్ టైన్ మెంట్ తో ప్రజలకు రోజురోజుకూ చేరువవుతూనే ఉంది. దీనికి ఉదాహరణే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్ లను పూర్తి చేసుకుని నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. కాగా ముందు నాలుగు సీజన్లకున్న క్రేజ్ మాత్రం అంతగా పొందలేదని చెప్పుకోవచ్చు. ఈ షోపై జరిగిన మూడు సీజన్లకంటే నెటిజన్లు ఎక్కువగానే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మా ఓటింగ్ కు విలువలేదంటూ నెటిజన్లు బిగ్ బాస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఓటింగ్ విధానంలో అవకతవకలు జరుతున్నాయని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంలో బిగ్ బాస్ హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగార్జునపై కూడా దీనిపై ఆరోపనలు కూడా ఎదురయ్యాయి. దానికి నాగర్జున గారు స్పందించారు. అయినా నెటిజన్లు మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎలిమినేషన్ ప్రక్రియపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేవి నాగవల్లి, కుమార్ సాయి, దివి, మిగతా కంటెస్టెంట్ ల ఎలిమినేషన్ విషయంలో డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
దీనితో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూడటానికి ఇష్టం చూపడంలేదు. దీనితో ప్రేక్షకుల హృదయాన్ని మార్చేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలిమినేషన్ అయిన వారందిరికి పోల్ నిర్వహించి అధికంగా ఎవరైతే ఓట్లు సంపాదిస్తారో వారిలో ఇద్దరిని మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సర్ ప్రైజ్ ఎవరిని వరించనుందో..
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!