`పెళ్ళిచూపులు` సక్సెస్తో హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తదుపరి `అర్జున్ రెడ్డి` చిత్రంతో క్రేజీ హీరోగా ఎదిగాడు. `గీతగోవిందం` వంద కోట్ల సాధించడంతో స్టార్ హీరో రేంజ్కు ఎదిగాడు. మోస్ట్ వాంటెడ్ హీరోగా క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు విజయ్దేవర కొండ హీరోగా రూపొందిన చిత్రం `డియర్ కామ్రేడ్`. `గీతగోవిందం`లో నటించిన విజయ్దేవరకొండ, రష్మిక మందన్నా జంట ఈ సినిమా నటించడంతో పాటు రీసెంట్గా విడుదలైన టీజర్, అందులో లిప్లాక్ సన్నివేశం సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ క్రేజ్తో సినిమా బిజినెస్ 40 కోట్లకు చేరిందట.
క్రేజ్ ఉందని నిర్మాతలు మరి భారీ రేట్స్కు కాకుండా పరిమితంగానే బిజినెస్ను పూర్తి చేశారట. అందులో భాగంగా నైజాం, సీడెడ్ను ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు 11.5 కోట్ల రూపాయలకు అమ్మారట. అయితే చదలవాడ తన నైజాం హక్కులను ఏషియన్ వారికి అమ్ముకున్నాడు. మరి ఎంతకు అమ్ముకున్నాడనేది తెలియడం లేదు. అలాగే ఆంధ్ర ఏరియాలో 10 కోట్లకు అమ్మారట. డిజిటల్ హక్కులు, ఓవర్సీస్ హక్కులు ఇలా అన్నీ కలిసి డియర్ కామ్రేడ్ 40 కోట్లకు చేరిందనేది సమాచారం. ఈ సినిమా మే 31న విడుదల కానుంది.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!