బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్తో బిజిబిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం అనంతరం మరో రెండు సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒకటి ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ కాగా, మరోకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్. ఈ చిత్రం 2021లో ప్రారంభం కానుంది. ఈ సినిమా పూర్తిగా మాఫియా నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త నెట్ ఇంట వైరల్ అవుతుంది.
ఈ సినీమా పేరు విడుదల చేసినప్పటి నుండి డార్లింగ్ కు జోడిగా ఎవరు నటిస్తారనే దానిపై పూర్తి వివరణ బయటకి రాలేదు. తాజాగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్తో జంటగా నటించిన దిశా పటానికి సాలార్ మూవీలో నటించే అవకాశం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ యాక్షన్ మూవీగా చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ ఎంపికపై సుముఖత లేనట్టు తెలుస్తుంది. ప్రభాస్ను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించనంత పవర్ ఫుల్గా చూపిస్తానని ప్రశాంత్ నీల్ ఇప్పటికే తెలిపాడు . ‘సలార్’ అంటే కమాండర్ చీఫ్ అని అర్థం, దాంతో ప్రభాస్ సినిమాలో గ్యాంగ్ కు లీడర్గా కనిపించనున్నాడని అర్ధమవుతుంది. లీడర్గా ఎలా మారతాడు, దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు అనే కథతోనే ఈ సినిమా ఉండబోతుందనే దానిపై సినిమా ఉంటుందని ఫిలిం నగర్ టాక్.
ఇకా దిశా పటాని విషయానికి వస్తే ప్రస్తుతం ఈ మలంగ్ బ్యూటీ హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమైనా ఆ చిత్ర అనంతరం పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత కుంగ్ ఫు యోగాలో నటించింది. ప్రస్తుతం ఈమె కె టీనా, రాధా అనే హింది చిత్రాలలో నటిస్తోంది. ఒక్క పెద్ద హిట్టు రాని ఈ ముద్దుగుమ్మకు డార్లింగ్ పక్కన నటించే అవకాశం వస్తుందనే దానిపై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!