సంగీత దర్శకుల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? అదే ఇప్పుడు వ్యక్తమవుతోందా? నెట్టింట్లో జరుగుతున్న పలు పరిణామాలను చూస్తే అదంతా నిజమేనని అనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాల కోసం అంతర్గతంగా వార్ జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ 25వ సినిమా `మహర్షి`కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. అదే కాదు, చాలా మంది హీరోల మైల్ స్టోన్ సినిమాలకు ఆప్షన్గా దేవీ ఉంటున్నాడు. అయితే మహర్షి సినిమాకు దేవిశ్రీ పెద్దగా మంచి సంగీతాన్ని అందివ్వలేదని టాక్. అలాంటప్పుడు అతన్నే మళ్లీ మహేష్ సినిమాకు ఎంపిక చేసుకున్నారు. దీన్ని ఒక అభిమాని ట్యాగ్ చేసి నెక్స్ట్ సినిమాకు తమన్ను తీసుకోమని అతను దూకుడు సినిమాకు అందించిన సంగీతం తాలూకు క్లిప్ను జతపరిచాడు. దాన్ని గమనించిన తమన్ లైక్ కొట్టాడు. అంతే రచ్చ రంబోలా అవుతోంది. తమన్ సంగీతం అందించిన గత సినిమాల్లో కాపీ ట్యూన్లు, డ్రమ్ములు ఒకటేంటి? దేవీ సంగీతాభిమానులు ఎన్నిరకాలుగా తమన్ను ట్రోల్ చేయొచ్చో అన్నీ రకాలుగానూ చేస్తున్నారు. దీని గురించి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ సంయమనం పాటిస్తున్నారు. ఈ నెట్టింట రచ్చ ఏ తీరాలకు దారి తీస్తుందో చూడాలి.
previous post