Politics: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎవరెవరో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. కంటెంట్ లేని వీడియోస్ ని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వారికి ఫ్యాన్స్ ఏర్పడడం కామన్ అయిపోయింది. ఈ కోవా కి చెందినదే ఫుడ్ షాప్ కుమారి ఆంటీ కూడా.
చూడడానికి చాలా పద్ధతిగా ఉండే ఆమెని.. ఆమె పని చేసుకోనివ్వకుండా ఇవ్వకుండా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేస్తూ సంతృప్తి పొందారు ట్రోలర్స్. దానిద్వారా ఆమెకి రూప లాభం కూడా ఉండదు. ఇక వీరు చేసిన పనికి కొందరు నాశనం అయ్యారు కూడా. ఎంతోమంది నిరుద్యోగులు మరియు స్టార్ హోటల్లో తినలేని వారు ఆమె బండి దగ్గర తక్కువ ధరకి తినేవారు. కానీ ప్రస్తుతం ఆమె ధరలు భారీగా పెంచడంతో వారి జీవితం బుగ్గిపాలయ్యిందనే చెప్పొచ్చు.
ఇక ఎంతో డీసెంట్ గా కనిపించే కుమారి ఆంటీ రాజకీయాల్లో ఆరితేరినదే. తినేది ఒకటి దగ్గర ఓటు మాత్రం మరొకడికి అన్నట్లు ఈమె ప్రవర్తన ఉంది. సాధారణంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకి జగన్ ఇల్లు ఇచ్చాడని వెల్లడించింది. కానీ ఆమె పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కూడా చెప్పుకొచ్చింది. కానీ ఆమె గత 20 సంవత్సరాలుగా టీడీపీకే ఓటు వేస్తున్నట్లు వెల్లడించింది.
దీంతో ఈమె మాటలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ముగ్గురిని బుట్టలో వేస్తూ బానే లాగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలను చూసిన కొందరు..” ఈమె కనుక రాజకీయాల్లోకి వెళితే జగన్ లాంటివారు పదిమంది వచ్చినా సరిపోరు. జగన్ లాంటి వాళ్లకి కుమారి ఆంటీ నే కరెక్ట్ ” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.