Kurnool: కర్నూలు జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. భార్య, అత్తను హత్య కేసు చేసిన కేసులో శ్రవణ్ కుమార్ కు అతని తండ్రికి న్యాయమూర్తి ఉరి శిక్ష విధించారు. జంట హత్య కేసులో ఇద్దరికి ఉరి శిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు జిల్లా అదనపు జడ్జి తీర్పు ఇచ్చారు. పెళ్లి అయిన 14 రోజులకే అనుమానంతో భార్య, అత్తను హత్య చేసిన శ్రావణ్ కుమార్ అతని తండ్రికి ఉరిశిక్ష విధించిన జడ్జి.. వీరికి సహకరించిన అతని తల్లికి జీవిత ఖైదు విధించారు.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలముని నగర్కు చెందిన శ్రావణ్ కుమార్ గత ఏడాది తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 14 రోజులకే అనుమానంతో శ్రవణ్ కుమార్ తల్లిదండ్రుల సహకారంతో భార్య రుక్మిణి ఆమె తల్లి రమాదేవిని అతికిరాతకంగా హత్య చేశాడు.
రుక్మిణి తండ్రి వెంకటేశ్ని దారుణంగా గాయపరిచాడు. కాగా, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. పోలీసులు విచారణ జరిపి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఘటన జరిగిన 13 నెలలలోపే విచారణ పూర్తి అయ్యింది. నిందితులపై నేర నిరూపణ కావడంతో న్యాయమూర్తి సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చారు.
YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా