Tillu Square: టాలీవుడ్ కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా “టిల్లు స్క్వేర్”. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో మార్చి 27వ తారీకు “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్ చేశారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సిద్దు జొన్నలగడ్డ నటించిన “డీజే టిల్లు” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా “టిల్లు స్క్వేర్” తెరకెక్కించారు. మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా… మాలిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే “టిల్లు స్క్వేర్” సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ మరియు పాటలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది.
యూట్యూబ్ లో కూడా అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్ కావటం జరిగింది. “డీజే టిల్లు” సినిమాలో రాధికతో క్రైమ్ ఎపిసోడ్ మాదిరిగానే…”టిల్లు స్క్వేర్” లోను మరో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉండబోతున్నట్లు టీజర్ మరియు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. మరోవైపు “టిల్లు స్క్వేర్” సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. సినిమా నిడివి మొత్తం 121 నిమిషాలు ఉన్నట్లు సమాచారం.
ఇక విడుదలైన ట్రైలర్ విషయానికొస్తే.. సెటైర్ డైలాగ్ తో.. స్టార్ట్ అయ్యింది. టిల్లు ఫాదర్ మల్ల ఏ పంచాయితీలా ఇరుక్కున్నావ్ రా అడిగిన వెంటనే అనుపమతో రొమాన్స్ స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. అంటే అనుపమ చేతిలో టిల్లు బలయినట్లు ట్రైలర్ లో చూపించారు. అంతేకాదు ప్రతి ఒక్కరి యాక్టింగ్ మరియు ఉరకలు ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల హాట్ లేడీస్ ని అంటూ ఫ్రెండ్స్ డైలాగు కూడా ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. మొత్తం మీద చూసుకుంటే “డిజె టిల్లు” దానికి డబల్ టైం ఎంటర్టైన్మెంట్ “టిల్లు స్క్వేర్”లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.