Intinti Gruhalakshmi: తులసి ముందు తనకు అవమానం జరిగిందన్న కోపంతో.. తనకి అందరి ముందు అవమానం జరగాలని లాస్య ఫ్రూట్ జ్యూస్ లో వైన్ కలుపుతుంది.. అది చూసిన దివ్య ఎలాగైనా ఈ ప్లాన్ చెడగొట్టాలని శృతితో అంటుంది.. శృతి కూడా లాస్య ప్లాన్ చెడగొట్టడనికి తను మిక్స్ చేసిన జ్యూస్ దివ్యతో మార్చేపించి ఆ జ్యూస్ తనే తాగేలా చేస్తారు వదిన మరదళ్లు..!
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరోయిన్ వేద బృందావనం మంచి కృష్ణుడు వచ్చాడు సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేసి పార్టీ లో జోష్ నింపుతుంది.. ఇక ఆదిత్య , అమర్ గంధం గజాలా అంతు చూడాలని మరో మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్ వేస్తారు. ఈ ప్లాన్ విన్న వేద పాపం వదిలేయచ్చు కదా అని అంటుంది. షూటింగ్ లో ఎలాగో ఇలాంటి తుంటరి పనులు చేస్తూనే ఉంటారు కదా.. ఇక్కడ పార్టీలో కూడా ఇలా చేయాలి అని అంటుంది. వాడికి అంత సీన్ లేదు మమ్మల్ని వాడికి టచ్ లో ఉండాలి అంటాడావాడు.. మమ్మల్ని ఎక్కడికో తీసుకు వెళ్తానని అన్నాడు.. అందుకే వాడికి స్కెచ్ వేసాం అని వేద తో చెప్తాడు ఆదిత్య.. అమర్ ఆదిత్య ఇద్దరూ గ్రంధం గజాలకు వెళ్లి మాది ఒక చిన్న కోరిక మీరు మాతో పాటు డాన్స్ వేయాలి అని అడుగుతారు. మీరు నాతో పాటు డ్యాన్స్ వేయలేరు. మీకు అంత ఎనర్జీ ఉండదు అని అంటున్న గజాల మాటలకు.. ముందు ఈ జ్యూస్ తాగండి సార్ మీరు అని అమర్ తాగుబోతు రమేష్ కు ఇవ్వగా.. ఆదిత్య ఎందుకురా వీడికి మర్యాదలు చేస్తున్నావ్ అని అంటాడు. ఈ జ్యూస్ లో ఒక ప్యాకెట్ మోషన్ టాబ్లెట్స్ కలిపా అని చెబుతాడు.. రెండు ప్యాకెట్లు కలిపి ఉండాల్సింది ఫోటోకి దండ వేసేవాళ్ళం అని అంటాడు ఆదిత్య. దండ ఏంటిరా డాన్స్ వేసిన తర్వాత నాకు సన్మానం చేయాలి అని అనుకుంటున్నారా అని అంటారు.. సరే సర్ పదండి అంటూ నాటు నాటు కి రెండు స్టెప్పులు వేయగానే గజాల చాలా సీన్ అయిపోతుంది. ఇక అమర్, ఆదిత్య ఇద్దరు ఎక్స్ట్రార్డినరీ పర్ఫామెన్స్ ఇస్తారు..
దివ్య ఇచ్చిన డ్రింక్ తాగిన లాస్య.. ఆ మైకంలో దిగు దిగు నాగు పాట కి తూలుతూ స్టెప్స్ వేస్తుంది.. అది చూసిన షాక్ లో అందరూ నందు వైపు చూస్తారు. నందు వెళ్లి లాస్య ను పక్కకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాడు.. నందు చేయి విదిలించుకొని మరి లాస్య డాన్స్ వేస్తుంది.. అందరూ చూసి నవ్వుతారు. ఇక తులసి రంగంలోకి దిగుతుంది. లాస్య ను గట్టిగా పట్టుకుని పక్కకు తీసుకు వస్తుంది. అలా పక్కుకు తీసుకు వచ్చి లాస్య మొహం మీద ఒక గ్లాసు నీళ్ళు కొడుతుంది.. ఆ మైకంలో నుంచి బయటకు వస్తూనే తులసి అని లాస్య గట్టిగా అరుస్తుంది.. అరవకు ఇప్పటి దాకా నువ్వు నువ్వు తాగిన మత్తులో చాలానే చేసావు… అది చూసి అందరూ నవ్వుతూ ఉంటే నిన్ను ఇలా పక్కకు తీసుకు వచ్చాను అని చెబుతోంది. నందు ఎక్కడా అని అడుగుతుంది. నువ్వు చేసిన పనికి కోపం వచ్చి నందు ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు అని అంటుంది.
నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే.. నందు నీకు జీవితాంతం దూరమవుతాడు అని అంటుంది. నువ్వు నాకు శాపనార్థాలు పెడుతున్నావా అని లాస్య అంటుంది.. దాంతో కోపం వచ్చిన తులసి.. నీ మెడలో ఉన్న తాళి నేను వేసిన భిక్ష.. మంచితనం ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరికి వేసిన భిక్షను మళ్లీ తీసుకోవాలి అని అనుకోరు.. నా జీవితం లాగా నీ జీవితం కాకూడదని నీకు ముందుగానే చెప్తున్నా.. నీ పద్ధతి మార్చుకోకపోతే నందు నిన్ను వదిలి వెళ్ళిపోవడం ఖాయం.. కావాలంటే ఇది రాసి పెట్టుకో అని చెబుతోంది తులసి. పాతికేళ్లు అయనతో కాపురం చేసిన తరువాత నేను ఈ విషయం చెబుతున్నాను.. దాంతో లాస్య నందు నన్ను వదిలి వెళ్లడం కాదు.. నీ వాళ్ళు ఎవరు నీకు కాకుండా చేస్తాను.. అందరూ నిన్ను వదిలి పోయేలా వెళ్ళిపోయేలా చేసి నిన్ను ఒంటరిని చేస్తాను అని అంటుంది లాస్య.. అదికూడా చూద్దామని తులసి అంటుంది.. ముందు నీ సంగతి చూసుకో తర్వాత నా విషయం అన్నట్టుగా అయోమయంలో పడుతుంది..