Prabhas NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్. ఈ ఇద్దరు హీరోల సినిమాలు మాస్ సెంటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడతాయి. టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు వీళ్ళ సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు. ఇక సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే రికార్డులు గల్లంతే. ఇండస్ట్రీలో అటువంటి ఇమేజ్ కలిగిన ఈ ఇద్దరు హీరోలు ఎప్పుడు ఒకే సినిమాలో కనిపించబోతున్నారట. విషయంలోకి వెళ్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ “కల్కి 2898 AD” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవి కాలంలో సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే “కల్కి 2898 AD” సినిమాలో ప్రభాస్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా చిన్న పాత్ర చేస్తున్నారట. ఈ ప్రాజెక్టులో కొంతమంది హీరోలు చిన్న చిన్న పాత్రలు చేస్తున్నట్లు గత కొద్ది నెలల నుండి వార్తలు వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు విజయ్ దేవరకొండ పేరు ఈ రకంగానే వినబడింది. గతంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “మహానటి” సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే విధంగా “కల్కి 2898 AD” లో చేసినట్లు టాక్ నడుస్తుంది.
విజయ్ దేవరకొండ మాత్రమే కాదు హీరో రానా, నాని కూడా నటిస్తున్నట్లు వార్తలు రావడం జరిగాయి. కాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు వినపడుతోంది. పరశురాముడు పాత్రలో ఆయన కనిపించబోతున్నారట. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా నిర్మితమవుతుంది. దీంతో నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత అశ్విని దత్ “కల్కి 2898 AD”నీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని వేల కోట్లు ఖరీదు చేసే హాలీవుడ్ కెమెరాలతో షూటింగ్ చేయడం జరిగిందట. విలక్షణ నటుడు కమలహాసన్ విలన్ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ నటుడు బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొనే మరియు దిశ పటానీ వంటి వారు కీలకపాత్రలు చేస్తున్నారు.