`మహానటి`తో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. తెలుగు, తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా `మహాటి` ఇచ్చిన గుర్తింపుతో హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కూడా చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఓ హిస్టారికల్ చిత్రంలో కీర్తి సురేష్ నటించబోతున్నారట. మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీర్తి సురేష్ కుందవి పిరట్టియార్ అనే రాణి పాత్రలో కనిపించబోతున్నారట. హిస్టారికల్ మూవీ అందులోనూ గ్రాండ్ స్కేల్తో రూపొందే చిత్రంలో రాణి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్కు మరో మంచి పాత్ర దొరికినట్టేనని కోలీవుడ్ వర్గాల టాక్. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జయం రవి, కార్తి, చియాన్ విక్రమ్ నటించనున్నారు. బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్, ఐశ్వర్యరాయ్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రధారులుగా కనిపించనున్నారని టాక్.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!