Madhuranagarilo February 21 2024 Episode 293: రాధా నేను చెప్పేది ఒక్కసారి విను మీ అక్క నువ్వు అనుకున్నంత మంచిది కాదు తన నిజ స్వరూపం తెలుసుకోవాలని నేను శ్యామ్ నాటకం ఆడాము అని కృష్ణ అంటుంది. ఇక చాలు ఆపు నువ్వు డాక్టర్ వే అనుకున్నాను నాటకలాడే యాక్టర్ కూడానా జీవితంలో నీ మొహం నాకు చూపించకు వెళ్ళిపో అని రాదా అంటుంది. వెళ్తాను రాదా కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో మీ అక్క మోసం చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించాలి అనుకుంటుంది మీ ఆయన మీద నీ కొడుకు మీద ప్రేమతో రాలేదు అని కృష్ణ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రాధా వెళ్లిపోవడానికి బట్టలు సర్దుకుంటుంది. కృష్ణ శ్యామ్ కి ఫోన్ చేస్తుంది. చెప్పు కృష్ణ అని శ్యామ్ అంటాడు. రాధకి నిజం తెలిసిపోయింది మనిద్దరం నాటకం ఆడమని రుక్మిణి బయట పెట్టింది అని జరిగిన విషయం అంతా చెబుతుంది కృష్ణ.
అవునా అంతకు తెగించిందా రుక్మిణి నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అని శ్యామ్ అంటాడు. శ్యామ్ తనకు అడ్డం వస్తే భర్తను బిడ్డనైనా అడ్డు తొలగించుకుంటాను అని నాతోటి అన్నది అంటే రుక్మిణి ఎంత క్రూరలో అర్థం చేసుకో నీ కాపురాన్ని రాదని ఎలా కాపాడుకుంటావో నీ ఇష్టం అని కృష్ణ అంటుంది. సరే కృష్ణ నేను ఇప్పుడే వెళ్లి రాధ తో మాట్లాడుతాను అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, రాధా బ్యాగ్ తీసుకొని బయటికి వెళుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ రాధా అని మధుర అడుగుతుంది.
నేను ప్రెగ్నెన్సీ ని నీ కొడుకు కృష్ణ కలిసి మోసం చేసి ఇంట్లో ఉంచారు ఇక ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ కాదని తెలిసింది కాబట్టి ఇకనుంచి వెళ్ళిపోతున్నాను అని రాధా అంటుంది. అది కాదు రాదా నేను చెప్పేది ఒకసారి విను అని మధుర అంటుంది. ఇంక మీరెవరు ఏం చెప్పినా నేను వినేది లేదు అత్తయ్య అంటూ రాధా బయటికి వెళుతుంది. శ్యామ్ తప్పు చేశాడని ఏలెత్తి చూపించడం కాదమ్మా నువ్వు కూడా అదే తప్పు ఎందుకు చేస్తున్నావ్ వాడు నీకు అబద్ధం చెప్పి ఇంట్లో ఉంచాడేమో కానీ నువ్వు కూడా వాడికి చెప్పకుండా వెళ్ళిపోయి తప్పు చేస్తావా అని మధుర అంటుంది.
శ్యామ్ వచ్చాక వాడికి చెప్పి అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపో అది పద్ధతి అని మధుర ఉంటుంది. రాధా ఆలోచనలో పడుతుంది. ఏంటి రాధా బ్యాగ్ కింద పెట్టింది కొంపతీసి ఆగిపోతుందా అని రుక్మిణి అనుకుంటుంది. సరే అత్తయ్య ఆయన వచ్చిన తర్వాతే చెప్పి వెళ్తాను అని రాదా అంటుంది. ఆల్మోస్ట్ వెళుతుంది అనుకున్నాను ఈ ముసల్ది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రాదని ఇంట్లో ఉంచేలా చేసింది అని రుక్మిణి టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే, శ్యామ్ కృష్ణ చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కారు నడుపుతూ ఉంటాడు కారుకు ఎదురుంగా ఒక పాప ఆడడం వస్తుంది ఆ పాపను చూసి శ్యామ్ కార్ పక్కకు తిప్పుతాడు కారు వెళ్లి ఒక చెట్టుకు గుద్దుకుంటుంది.
అక్కడే ఒక గురువుగారు ఉంటారు ఆయన తీసుకువెళ్లి తన ఆశ్రమంలో పడుకోబెట్టి ఏమైందని చూస్తారు. తలకి బాగా గాయమైంది వాళ్ల ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి చెప్పు అని గురువుగారు అంటారు. అలాగే అని తన శిష్యుడు ధనంజయ్ కి ఫోన్ చేస్తాడు. ఇదిగో రాధ శ్యామ్ ఫోన్ చేస్తున్నాడు అంటూ ధనుంజయ్ ఫోన్ ఎత్తుతాడు. హలో శ్యామ్ చెప్పరా అని ధనంజయ్ అంటాడు. శ్యామ్ కి యాక్సిడెంట్ అయిందని అవతల ఉన్న వ్యక్తి చెబుతాడు. శ్యామ్ కి యాక్సిడెంట్ అయింది అంట అని ధనుంజయ్ అంటాడు.
కట్ చేస్తే, అందరూ శ్యామ్ దగ్గరికి వస్తారు. స్వామి నా భర్త కి ఏమైంది నా ప్రాణాలు ఇచ్చే నా భర్తను కాపాడుకుంటాను అని రుక్మిణి అంటుంది. గురువుగారు మా వాడికి ఏమైంది అండి అని మధుర అంటుంది. మా వాడికి ప్రాణాపాయస్థితి లేదు కదా గురువుగారు అని ధనంజయ్ అంటాడు. జాతక ప్రభావం వల్ల అతనికి యాక్సిడెంట్ అయిందమ్మ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది కదా అని గురువుగారు అంటారు. మా వాడి జాతకం డేట్ బర్త్ చెప్తాను వాడికి ఏ దోషం ఉందో చెప్పండి అని మధుర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!