Mahesh – Trivikram: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్సైనట్టు తాజా సమాచారం. గతంలో మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, ఖలేజా లాంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు వీరి కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ మొదలవబోతోంది. ఇటీవల కొవిడ్ బారిన పడిన మహేశ్ పూర్తిగా కోలుకొని మళ్ళీ డబుల్ ఎనర్జీతో షూటింగ్స్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
తాజాగా ఈ షెడ్యూల్లో మహేశ్ కూడా జాయిన్ అయ్యారు. మార్చ్ వరకు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు జరిగిన సర్కారు వారి పాట షూటింగ్కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తైందట. ఇప్పుడు జరుగుతున్న షూటింగ్కి సంబంధించి మాత్రమే బ్యాలెన్స్ ఉండగా.. షూటింగ్తో పాటు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ను జరపనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేశ్ బాబు ఎంటర్టైనెమెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
Mahesh – Trivikram: అన్నీ అనుకున్నట్టు పూర్తైతే ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా రిలీజ్..!
ఏప్రిల్ 1న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే, ఫిబ్రవరి 3వ తేదీన మహేశ్, త్రివిక్రం సినిమా అధికారికంగా లాంచ్ కానుంది. ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారట. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాకు కూడా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!