Pallavi Prashanth: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అందరికీ సుపరిచితుడే. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో చాలామంది సెలబ్రిటీలు అడుగుపెట్టిన కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడం జరిగింది. హౌస్ లో ఇతర కంటెస్టెంట్లు అనేక మార్లు తక్కువ చేసి మాట్లాడిన.. ప్రశాంత్ ఎక్కడ వెనకడుగు వేయకుండా నిలబడటానికి కారణం నటుడు శివాజీ. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడంలో శివాజీ పాత్ర అతి పెద్దది. ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్ లో టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్… ఆ సమయంలో తనకొచ్చిన డబ్బును పేదలకు రైతులకు పంచుతానని మాట ఇచ్చారు.
అయితే ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రశాంత్ అడుగులు వేస్తున్నారు. గజ్వేల్ లోని కొలుగూరు గ్రామానికి చెందిన పేద రైతు ఫ్యామిలీకి లక్ష రూపాయలు సాయం చేయడం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం డబ్బు సహాయం చేయడంతో పాటు సరిపడా బియ్యం సైతం ప్రశాంత్ అందజేయడం గమనార్హం. ఇదే సమయంలో సందీప్ మాస్టర్ సైతం ఆ పేద రైతు కుటుంబానికి తనవంతుగా పాతికవేల రూపాయలు సాయం చేశారు. పల్లవి ప్రశాంత్ అదేవిధంగా సందీప్ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. ప్రాణం పోయినా మాట తప్పనని మీకు ఇచ్చిన మాట కోసం ముందుగా చేసిన సహాయం లక్ష రూపాయలు అని ప్రశాంత్ తెలిపారు.
అంతేకాదు ఏడాదికి సరిపడా బియ్యం రైతు కుటుంబానికి అందజేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సాయం చేసే దిశగా ప్రశాంత్ అడుగులు వేయడంతో నెటిజెన్స్ పొగుడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు చేయాలని ప్రశంసిస్తున్నారు. టైటిల్ గెలిచాక మధ్యలో గ్యాప్ రావటంతో ప్రశాంత్ మనీ ప్రైస్ ఏం చేశాడని చాలామంది రకరకాల ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో ఒక రైతు కుటుంబానికి సాయం చేసే దిశగా ప్రశాంత్ ముందడుగు వేయడంతో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు అయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!