డైరెక్టర్ పరశురామ్, గీతా ఆర్ట్స్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ బ్యానర్లో ఆయన చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ‘గీత గోవిందం’ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. దర్శకుడు పరశురామ్పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మూడో సినిమా కూడా గీతా ఆర్ట్స్లోనే అనుకున్నారంతా.. అయితే, తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆయన గీతా ఆర్ట్స్ను పక్కన పెట్టి… మరో బ్యానర్లో సినిమా చేయబోతున్నారట. హీరో కూడా ఫిక్స్ అయిపోయాడట.
ఇంతకూ ఆ హీరో ఎవరో కాదు. అక్కినేని నట వారసుడు నాగ చైతన్య. ఆ బ్యానర్ 14 రీల్స్ ఎంటర్టైనర్. పరశురామ్ చెప్పిన కథకు చైతన్య ఓకే చెప్పాడని టాక్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా మొదలు కానుందని సమాచారం. ఏడాదిగా గీతా ఆర్ట్స్ సినిమా కోసం వేచి చూసిన పరశురామ్.. అక్కడ ఎలాంటి ముందడుగు పడకపోవడంతో.. ఈ సినిమా చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!