ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం ప్రభాస్ 21వ మూవీ అప్డేట్. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోందని ఘనంగా చాటింది వైజయంతీ సంస్థ. దీనిపై చిత్ర దర్శకుడు కూడా ‘రాజుకు జోడీగా రాణి కావల్సిందే కదా. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఇక చంపేద్దాం అంతే’ అంటూ ట్వీట్ చేశాడు. రాజుకు రాణి.. అనే ఒక్క మాటతో సినిమా గ్రాండియర్ చెప్పేశాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ తో తెరకెక్కుతుందని సమాచారం.
తెలుగు సినిమాల్లో వైజయంతీ సంస్థ ప్రయాణానికి 50 ఏళ్లయిన సందర్భంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. దాదాపు 250 నుంచి 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు తమిళ, హింది భాషల్లో తెరకెక్కే ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తాడని అంటున్నారు. సినిమాలో ఊహించని అద్భుతాలు ఉంటాయని అంటున్నారు. ఆన్ బోర్డ్ లో ఇంకొంతమంది స్టార్స్, టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తారని సమాచారం.
దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు కానుంది. ఆ తర్వాత ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కనుంది. ప్రభాస్ – దీపికా నేషన్ వైడ్ క్రేజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!