Adipurush: జూన్ 16వ తారీకు “ఆదిపురుష్” విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ సీత పాత్రలో కృతి సనన్ నటించడం జరిగింది. దీంతో పాన్ ఇండియా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రస్తుత తరానికి అర్థమయ్యే రీతిలో.. టెక్నాలజీని జోడించి చాలా అద్భుతంగా తెరకెక్కించారు. దీంతో వీలైనంతవరకు ప్రజల్లో బలంగా ఈ సినిమాని చూపించే విధంగా సినిమా యూనిట్ తో పాటు సెలబ్రిటీలు రెడీ అవుతున్నారు. “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా వచ్చిన చిన్న జీయర్ స్వామి సైతం.. రామాయణం నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.
కానీ ప్రస్తుత తరానికి టెక్నాలజీని జోడించి చూపించడానికి సినిమా యూనిట్ చేసిన ప్రయత్నం సంతోషించదగ్గ విషయం అని ప్రశంసించారు. ఇదంతా పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు టికెట్లకు పైగా.. అనాధలకు మరియు ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు.. సినిమా చూపించబోతున్నట్లు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటన చేయటం జరిగింది. కాగా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా నిరుపేదల చిన్నారులకు, అనాధలకు, వృద్ధులకు ఉచితంగా పదివేల టికెట్స్ బుక్ చేయటం జరిగిందట. ఇక ఇదే తరహాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సైతం పదివేల టికెట్లు బుక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రామాయణం కథ కావటంతో వీలైనంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సెలబ్రిటీలు “ఆదిపురుష్” నీ మరింతగా ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్…”ఆదిపురుష్”తో మంచి విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ 21 ఏళ్ల కెరియర్ లో ఫస్ట్ టైం తెలుగు దర్శకుడు కాకుండా బయట బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా చేయటంతో..”ఆదిపురుష్” ఫలితం పై అభిమానులు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.