Samantha: హీరోయిన్ సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేయడం జరిగింది. కొద్దిరోజుల క్రితం పాడ్ కాస్ట్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు ఆరోగ్యం గురించి చెప్పబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా లేటెస్ట్ గా “టేక్ 20” అనే పాడ్ కాస్ట్ ను స్టార్ట్ చేయడం జరిగింది. తన వ్యక్తిగత జీవితంలో రెండు సంవత్సరాలుగా అనుభవించిన అనేక బాధలు మయోసైటీస్ వంటి ప్రమాదకరమైన రోగం నుంచి ఎలా కోలుకున్నాను అనేది వివరిస్తాను. కచ్చితంగా ఇది అందరి జీవితాలను మార్చే విధంగా ఉంటుంది. ఇందులో చెప్పే విషయాలు కూడా ఎన్నో సంవత్సరాలుగా అనుభవజ్ఞులు పరిశోధన చేసినవి. అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి కాబట్టి అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి అని వీడియోలో సమంత తెలియజేయడం జరిగింది.
మనం నేర్చుకోవడం మాత్రమే కాదు.. ఇతరులకు కూడా అందించేలా ఉండాలి. మనందరి జీవితాలను మంచిగా మలుచుకోవటంతో పాటు ఎలా జీవితాన్ని అదుపులో పెట్టుకోవాలి అనేది తెలియజేయబోతున్నాను. ఇదే సమయంలో పూర్తి వీడియో ఫిబ్రవరి 19వ తారీకు రాబోతున్నట్లు సమంత తెలియజేసింది. చాలా నెలల తర్వాత సమంత కొత్తగా ప్రేక్షకులకు పాడ్ కాస్ట్ ద్వారా దగ్గరవుతున్న క్రమంలో ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2011లో సమంత హీరోయిన్ మంచి సక్సెస్ కెరియర్ అనుభవించింది. 2017లో నాగచైతన్యతో పెళ్లి కావడం జరిగింది.
పెళ్లయిన నాలుగు సంవత్సరాలకు 2021లో విడాకులు తీసుకోవడం జరిగింది. వ్యక్తిగత జీవితంలో పెళ్లయిన తర్వాత సమంత ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు తీసుకున్న ఏడాదికే మయాసైటిస్ అనే ప్రమాదకరమైన వ్యాధి బారిన పడింది. ఆ సమయంలో సమంత పని అయిపోయిందని చాలామంది భావించారు. కానీ చాలా ప్రమాదకరమైన ఆ వ్యాధి భారీన పడి సురక్షితంగా చికిత్స తీసుకుని బయటపడింది. ఈ రకంగా వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యపరంగా ఎదుర్కొన అనేక సమస్యలను జయించిన సమంత ఇప్పుడు తన అనుభవాలను పాడ్ కాస్ట్ ద్వారా పంచుకోనుంది. దాదాపు రెండు సంవత్సరాలు తన అనుభవించిన అనేక విషయాలు వాటి నుండి బయటపడిన విధానం గురించి తెలియజేయబోతున్నట్లు పాడ్ కాస్ట్ ఫస్ట్ ప్రోమోలో సామ్ స్పష్టం చేయడం జరిగింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!