Pallavi Prashant: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి ఉండడంతో ఏదోరకంగా పాపులర్ అవుతున్నారు. ఈ కోవా కి చెందిన వారే బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మరియు శిరీష. వీరిద్దరూ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిన్న చిన్న వీడియోలతో పెద్ద సెన్సేషన్ సృష్టించారని చెప్పొచ్చు. నేను బిగ్ బాస్ కి పోవాలి అంటూ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూ చివరికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్.
తన 105 రోజుల జర్నీని చూసి ప్రతి ఒక్కరూ శభాష్ అన్నారు కూడా. ఇక చివరికి బిగ్ బాస్ 7 కి విన్నర్గా నిలిచాడు. ఇక పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన అనంతరం పెద్దగా కనిపించడం లేదు. అదేవిధంగా ఒక్క వీడియోతో పాపులర్ అయిన శిరీష అలియాస్ బర్రెలక్క కూడా మనందరికీ సుపరిచితమే. నేను అమ్మాయిగా పోటీ చేయాలనుకుంటున్నాను అంటూ ఎమ్మెల్యే కింద టికెట్ ని సాధించింది బర్రెలక్క.
కానీ విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష వీటిపై కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈమె మాట్లాడుతూ..” నాకు.. ప్రశాంత్ కి పెళ్లి అనే ఈ వార్తలు నేను వినలేదు. వ్యూస్ కోసం ఈ విధంగా చేస్తున్నారు అనుకుంటా.
ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ పరువుని దిగజార్చుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నేను ప్రశాంత్ ని అన్న అని పిలుస్తా. అలాంటి వాడితో నాకు అక్రమ సంబంధం పెట్టడం చాలా తప్పు ” అంటూ మండిపడింది శిరీష. ప్రస్తుతం శిరీష వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఈమెకి సపోర్ట్ చేస్తున్నారు కూడా.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!