తెలుగు సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో `RRR` ఒకటి. రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్లతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియాభట్ నటిస్తున్నారు. 400 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. రాంచరణ్ కాలి గాయం కారణంగా షూటింగ్ ఆగింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో రాంచరణ్ జతగా అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ జోడిగా నటించాల్సిన డైసీ ఎడ్గార్గ్ జోన్స్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఈమె స్థానంలో ఎవరినీ తీసుకోవాలా? అని రాజమౌళి యోచిస్తున్నాడు.
డైసీ జోన్స్ స్థానంలో నిత్యామీనన్ను తీసుకుంటారని పేరు ప్రముఖంగా వినపడింది. తర్వాత పరిణీతి చోప్రా పేరు కూడా వినపడింది. ఇప్పుడు శ్రద్ధాకపూర్ను తీసుకోబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం శ్రద్ధాకపూర్ ప్రభాస్తో `సాహో`లో నటించింది. `RRR`లో డైసీ స్థానంలో శ్రద్ధా కపూర్ను తీసుకోవాలని ప్రభాస్ రెకమెండేషన్ చేశాడని అందుకనే రాజమౌళి శ్రద్ధాకపూర్ను తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూద్దాం.
previous post
next post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!