చరణ్తో ధృవ, చిరంజీవితో సైరా నరసింహారెడ్డి చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు సురేందర్రెడ్డి. తదుపరి ఈయన ప్రభాస్తో సినిమా చేస్తాడని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముగియగానే సురేందర్ రెడ్డి సినిమా ఉండే అవకాశాలున్నాయని టాక్. అందుకు మరి కాస్త సమయం పట్టేలా ఉంది. అయితే ఈలోపు సూరి నిర్మాతగా మారబోతున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలకు కథను సురేందర్ రెడ్డినే అందిస్తాడట. మరి ఈ వ్యవహారంపై సురేందర్ రెడ్డి ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!