ఇకపై ఆన్లైన్లో సినిమా టికెట్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆన్లైన్లో సినిమా టికెట్స్ను ఆపు చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఇకపై ప్రభుత్వమే నేరుగా సినిమా టికెట్స్ను విక్రయించాలని యోచిస్తుంది. ఇలా చేయడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ లాభపడతారని ప్రభుత్వం భావిస్తుంది. శనివారం మీడియా ప్రతినిధులతో ఆయన మాటల్లో ఈ విషయాన్నితెలియజేశారు. ఇకపై థియేటర్స్లో 18 నుండి 20 లైన్స్.. 8 నుండి 10 వరుస సిట్టింగ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. మరి దీనిపై సినీ పెద్దలు, దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!