బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న ‘సాహో’. దాదాపు 200కోట్ల బడ్జట్ తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ ‘సాహో’ షూటింగ్ లో ప్రభాస్ అండ్ టీమ్ బిజీగా ఉంటే స్పాట్ కి అనుకోని అతిథి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడట.
‘సాహో’ మూవీ సెట్స్ కు వచ్చిన ఆ సర్ప్రైజింగ్ గెస్ట్ మరెవ్వరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో థల అజిత్. రీసెంట్ గా విశ్వాసం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజిత్, ప్రస్తుతం ‘పింక్’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం అజిత్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాడు. ఈ పింక్ మూవీ షూటింగ్ గ్యాప్ లో అజిత్ పక్కనే ‘సాహూ’ షూటింగ్ జరుగుతుందని తెలుసుకోని ప్రభాస్ ని కలవడానికి స్పాట్ కు వెళ్లాడట.
అజిత్ రాకతో ఆశ్చర్యపోపోయిన సాహూ చిత్ర యూనిట్, అజిత్ తో సెల్ఫీ లు ఫొటోలు తీసుకోవడంతో పాటు సాహో మేకింగ్ వీడియోని కూడా చూపించారట. ప్రభాస్ కూడా అజిత్ కోసం తన ఇంటి భోజనం రుచి చూపించాడని తెలుస్తోంది. చాలా సేపు ఇద్దరు స్టార్ హీరోలు మంచి టైం స్పెండ్ చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఎప్పుడు బయటకి వస్తాయని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.