Krithi Shetty: కృతి శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్లో ఈమె ఒకరు. కెరీర్ స్టార్టింగ్లోనే హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్లో ఉన్న కృతి శెట్టికి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే, ఈమె నటించిన తొలి చిత్రం `ఉప్పెన` గత ఏడాది సరిగ్గా ఇదే రోజు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
మెగా మేనల్లుడు వైష్టవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే `ఉప్పెన`. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషించారు. భారీ అంచనాల నడుమ 2021 ఫిబ్రవరి 12న రిలీజైన ఈ మూవీ తొలి రోజే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ భారీ కలెక్షన్లను రాబట్టింది.
ముఖ్యంగా ఈ మూవీలో బేబమ్మగా కృతి శెట్టి తనదైన నటన, క్యూట్ నెస్తో అందరినీ ఫిదా చేసింది. అయితే ఉప్పెన విడుదలై ఏడాది అయిన సందర్భంగా.. కృతి శెట్టి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. `ఉప్పెనకి ఏడాది. మనకు రెండు పుట్టిన రోజులు ఉంటే. ఒకటి మనం పుట్టిన రోజు, మరొకటి మనం ఎంచుకునేది. అందుకు నేను ఈరోజుని ఎంచుకుంటాను. ఎందుకంటే ఈ రోజుతో నా జీవితం ప్రారంభమైంది.
ఏడాది క్రితం నటిగా పరిశ్రమలోకి అడుగు పెట్టా. నేను ఎంచుకున్న రంగంలో ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నా. ఇండస్ట్రీ నన్ను ఆప్యాయంగా స్వీకరించింది. నాపట్ల మీరు పాజిటివ్గా ఉండటం ఎంతో సంతోషానిచ్చింది. ఈ ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేసిన నా అభిమానులకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఇలానే అలరిస్తానని, కష్టపడి పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నా.` అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా కృతి శెట్టి రాసుకొచ్చింది. దీంతో ఆమె పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!