2023 Tollywood Deaths: 2023వ సంవత్సరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. చాలామంది ప్రముఖ నటీనటులు ప్రాణాలు విడవటం జరిగింది. అంతకుముందు ఏడాది 2022లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, రమేష్ బాబు, ఏమ్ బాలయ్య, తాతినేని రామారావు, డైరెక్టర్ శరత్, డీఎంకే మురళి, గురు స్వామి, కండికొండ, చలపతిరావు. ఆ తర్వాత 2023 అనగా ఈ ఏడాది మొదలవగానే ప్రారంభంలోనే చాలా మరణాలు సంభవించాయి. ఏడాది ప్రారంభంలోనే కళాతపస్వి విశ్వనాధ్, గాయని వాణి జయరాం లోకాన్ని విడిచారు. తర్వాత నందమూరి తారక రత్న 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు.
కే.విశ్వనాథ్ సినీ నేపథ్యం చూస్తే ఆయన ఎన్నో వైవిద్యమైన సినిమాలు చేయడం జరిగింది. సిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం సూత్రధారులు స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా సత్తా చాటారు. “శుభసంకల్పం” సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కే విశ్వనాథ్… వజ్రం, కలిసుందాం రా, నరసింహనాయుడు, సీమ సింహం, నువ్వు లేక నేను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు సినిమాలలో కీలకపాత్రను పోషించారు. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గెలవడం జరిగింది. ఆ తర్వాత దర్శకుడు సాగర్ రాకాసి లోయ చిత్రంతో దర్శకుడుగా తన జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అమ్మ దొంగ, స్టువర్టుపురం దొంగలు, రామ సక్కనోడు, ఖైదీ బ్రదర్స్ లాంటి సినిమాలు చేయడం జరిగింది.
లెజెండరీ నటి జమున తెలుగులో.. అనేక సినిమాలు చేయటం జరిగింది. ఆమె నటించిన అనేక పాత్రలలో సత్యభామ పాత్ర ఆమెకి ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చింది. వయసు రిత్యా వచ్చిన అనారోగ్యంతో జమున కన్నుమూశారు. గత నెల నవంబర్ నెలలో తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా తుది శ్వాస విడిచారు. కొంత కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాయని హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 18వ తారీకు మరణించారు. నటుడిగా చంద్రబాబుకి ఆల్రౌండర్ అనే పేరు ఉంది. 78వ ఏట.. చంద్రమోహన్ మరణించారు. కళాతపస్వి కే. విశ్వనాధ్ గారికి చంద్రమోహన్ చాలా దగ్గర బంధువు. 1966 లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఎన్నో సినిమాలు చేసి రకరకాల పాత్రలతో మెప్పించారు. 1987లో చందమామ రావే సినిమాతో నంది అవార్డు అందుకున్నారు. 1978లో పదహారేళ్ళ వయసు సినిమాతో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అనేక నంది అవార్డులు గెలవడం జరిగింది. ఈ రకంగా ఈ ఏడాది చాలామంది తెలుగు tతారలు మరణించారు.