Trinayani Today Episode March 6 2024 Episode 1181 highlights పాల బాటిల్ గాయత్రి పాపకి ఇచ్చిందంటే డౌట్ రాలేదు నైని కి అని తిలోత్తమ అనుకుంటుంది. గాయత్రి పాప బాటిల్ పక్కకు పెడుతుంది అది చూసి ఉలోచ వచ్చి ఆ పాల డబ్బాలో పాలు తాగేస్తుంది . మమ్మీ పాప పాలు తాగుతుంది అందులో విష0 ఉందన్న విషయం వీళ్ళకి తెలియదు కదా మమ్మీ అని వల్లభ అంటాడు. ఏంటి తల్లి కొడుకులు గునుకుంటున్నారు మాకు చెప్పొచ్చు కదా అని హాసిని అంటుంది. వీడికి లేనిపోని డౌట్స్ వస్తున్నాయ్ అని తిలోత్తమ అంటుంది. నీమీద అఖండస్వామిని ఇంటికి పిలిపించి చావు అంచుల దక తీసుకువెళ్లారు కదా అని హాసిని అంటుంది. గాయత్రీ పెద్దమ్మ ఫోటో వెనకనుంచి పాము వస్తుందని మాకేం తెలుసు అని వల్లభ అంటాడు. అప్పుడంటే వచ్చింది ఇప్పుడు రమ్మన్నా రాదులే అని తిలోత్తమ అంటుంది. అంత నమ్మకంగా ఎలా చెప్పగలిగావ్ అమ్మ అని విశాల్ అంటాడు. ఏం చేశారు మళ్లి అని విక్రాంత్ అంటాడు. చెడ్డ పని చేస్తేనే శిక్షించడానికి నాగయ్య వస్తాడు అని నైని అంటుంది. అయ్యా రాదు అమ్మా రాదు అని తిలోత్తమ అంటుంది. పాములు బిజీగా ఉన్నాయేమో మీలాగా అని హాసిని అంటుంది. ఉలోచి పాలు తాగి వెళ్లిపోతుంది. అరే ఈ పిల్లకి రెండు సంవత్సరాలు కూడా లేవు తన పని తనే చేసుకుంటుంది అని సుమన అంటుంది.
నైని వదిన అలా పెంచింది మరి అని విక్రాంత్ అంటాడు. నేను కూడా అలాగే పెంచుతాను అని సుమన అంటుంది. ఇప్పుడైతే గొప్ప పని చేసింది పాప అని డమ్మక్క అంటుంది. ఏం చేసిందో చెప్పు డమ్మక్క అని పావన మూర్తి అంటాడు. చెప్పలేను పాము అని డమ్మక్క అంటుంది. కట్ చేస్తే, విక్రాంత్ ఉలోచి కోసం వెతుకుతూ ఉంటాడు. పాలు తాగిస్తావా చెల్లి అని హాసిని అంటుంది. తెల్లగా ఉన్నాయి ఇవి పాలు కాదా అక్క అని సుమన అంటుంది. మజ్జిగ కూడా తెల్లగానే పాలు లాగే ఉంటుంది చెల్లి అందుకని పట్టిస్తావా ఏంటి అని అంటుంది. ఎక్కడినుంచి తెచ్చావు పాలు అని విక్రాంత్ అంటాడు. మా అక్క కాచి సగం పాలు ఉంచింది కదా అవే తెచ్చాను అని సుమన అంటుంది. దయచేసి ఆ పాలు తాగించకు మల్లి తాగిస్తే ఉలోచి వాంతు చేసుకుంటుంది అని హాసిని అంటుంది.ఎప్పుడు తాగింది అని సుమన అంటుంది. ఎప్పుడో తాగేసింది ఈ పాలు తాగింది పాప కాదు పాము కాదు అని హాసిని అంటుంది. మరి ఈ పాలు ఎవరు తాగుతారు వదిన అని విక్రాంత్ అంటాడు. మా ఆయన మా అత్తయ్య తాగుతుంది విక్రాంత్ అని హాసిని అపాలు తీసుకొని వెళుతుంది హాసిని. కట్ చేస్తే, నైని ఇప్పటివరకు పాలలో విషం ఉందని కనిపెట్ట లేదంటే దాని అర్థం ఏమనుకుంటున్నావు రా అని తిలోత్తమ అంటుంది. జోగయ్య శాస్త్రి మనవరాలు దత్తత తీసుకుంటున్నామని నటిస్తున్నారు అని వల్ల అంటాడు.
ఇక అయిపోయిందా మీ నటన అని హాసిని పాలు తీసుకువస్తుంది. ఎవరిదే నటన నైనిధి విశాల్ ది నటన అని వల్లభ అంటాడు. ఏమంటున్నాడు అత్తయ్య మీ కొడుకు అని హాసిని అంటుంది. తనకి ఆపద వచ్చినా వేరే వాళ్ళకి ఆపద వచ్చినా కనిపెట్టలేదు కదా అని తిలోత్తమ అంటుంది. వారిని అదా మీ బాధ అని హాసిని అంటుంది. ఏంటి తిక్క తిక్క మాట్లాడుతున్నావ్ అని వల్లభ అంటాడు. గాయత్రి పాప పాలు తాగిన కనిపెట్టలేదనే కదా మీ బాధంతా అందులో ఏం కలిపారు హాసిని అంటుంది. ఆ పాలలో సంథింగ్ కలిపింది మా అమ్మే ఆపాలలో విషం ఉందనీ కనిపెడితే పాప అనాధ పిల్ల నైని అలా కనిపెట్టకపోతే గాయత్రీ పెద్దమ్మ అన్నట్టే కదా అర్థం అని వల్లభ అంటాడు. అలసిపోయారా రాజా మంచినీళ్లు తాగండి అంటూ ఇస్తుంది హాసిని. మీరేం చెప్తారు అత్తయ్య అని హాసిని అంటుంది. ఇంకేముంది నా కొడుకు చెప్పేసాడు కదా అని తిలోత్తమ అంటుంది. గాయత్రి పాప పాలు తాగిన నైని కనిపెట్టలేక పోయిందనే కదా మీ బాధంతా గాయత్రీ పాప ఏం చేసిందో చూద్దామా అని వీడియో చూపెడుతుంది హాసిని. అంటే ఆ పాలు ఉలోచి తాగిందా అని తిలోత్తమ అంటుంది. అంటే పాలు తాగితే నైనీ క్యాష్ చేసేది కానీ ఆ పాప తాగలేదు కదా ప్రాబ్లం లేదు అని హాసిని అంటుంది.
మిగిలిన పాలు మీరు తాగేశారు అని హాసిని అంటుంది. పాలు వాంతులు చేసుకుంటాడు వల్లభ. కట్ చేస్తే, డమ్మక్క ఏదో మాట్లాడితే పావనమూర్తి నవ్వుతూ ఉంటాడు. ఏంటి మామయ్య అత్తయ్యకి బదులు డమ్మక్క నవ్విస్తుంది అని వల్లభ అంటాడు. ఇంతలో అందరూ కిందికి వస్తారు. నైని నాకు ఒక సందేహం తీరుస్తావా అని డమ్మక్క అంటుంది. ఏంటి అని నైని అడుగుతుంది. పూజ చేశాక శివయ్యని ఇంటికి తీసుకువస్తారా అని డమ్మక్క అంటుంది. ఇంతలో గురువుగారు వస్తారు. సమయానికి వచ్చారు గురువుగారు జాగారం చేసి స్వామి వారి కరుణాకటాక్షాలు పొందాలని అనుకుంటున్నాం అని నైని అంటుంది. నీలకంఠుడ్ని పూజించి ఇంటికి తీసుకువస్తే ఆయన అనుగ్రహం మీకు లభిఛీ అమ్మ వారి దర్శన భాగ్యం కలుగుతుంది అని గురువుగారు అంటారు. చూసావా అత్తయ్య అమ్మవారిని చూడొచ్చంట అని హాసిని అంటుంది. ఆవిడ ఏమైనా చుట్టమా అంత సంతోష పడిపోతున్నావ్ అని తిలోత్తమ అంటుంది. పోయేటప్పుడు ఏమొస్తుంది అత్తయ్య అమ్మవారి దర్శన భాగ్యం కలిగితే చాలు అని హాసిని అంటుంది.
ఇంతలో గాయత్రి పాపా ఏదో పట్టుకొని వస్తుంది. ఏమి చెరా పిల్లకి నోట్లో పెట్టుకుంటుంది అని దురంధర అంటుంది. తులసి ఆకులు అనుకుంట పిన్ని తిన్న మంచిదేలే అని నైని అంటుంది. చివరికి ఆకులు తినాలనిపించిందన్నమాట ఆ పిల్లకి అని సుమన అంటుంది. తినడానికి తీసుకురాలేదు సుమన గురువుగారికి చూపించడానికి తీసుకువచ్చింది అని డమ్మక్క అంటుంది. అర్థమైంది గాయత్రి అఖండ స్వామి పాము కాటికి గురైన తరువాత పాము గండ నుంచి తప్పించుకోవడానికి తులసిదలని ఇచ్చాను వాటిని ఇక్కడికి ఎవరు తెచ్చారు అని గురువుగారు అంటారు. ఎవరు అని పావనమూర్తి అంటాడు. స్వామిని తీసుకువెళ్లిన మా ఆయన అత్తయ్య తెచుంటారు అని హాసిని అంటుంది. పాము కాటేసిందని భయపడ్డారా బావగారు అని సుమన అంటుంది. మాకెందుకు భయం అని తిలోత్తమ అంటుంది.
తూలిసాకులు వేస్తే నాగయ్య కానీ పెద్ద బొట్టమ్మ కానీ రారు అని గురువుగారు అంటారు. వాళ్లు ఇంట్లోకి రాకూడదని తెచ్చారా అత్తయ్య అని నైని అంటుంది. చిన్నపిల్లలు తిరగడుతున్నారు పాములు వస్తే ప్రమాదం అని తిలోత్తమ అంటుంది. ఎవరికి లేని ఆరాటం మీకెందుకు అని హాసిని అంటుంది.గాయత్రీ అత్తయ్య పునర్జన్మ ఎత్తింది ఎక్కడుందో తెలియదు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరేమో పూజలు పునస్కారాలు అంటూ తిరుగుతున్నారు అది విశాల్ బావ మీద ఉన్న ప్రేమ తిలోత్తమ అత్తయ్యకి అని సుమన అంటుంది. చాలా పెద్దగానే చెప్పావు అని విక్రాంత్ అంటాడు.
అక్కడ ఇక్కడ వెతకడం ఎందుకు గాయత్రీ దేవి అత్తయ్యని ఇక్కడే చూడొచ్చు అని హాసిని అంటుంది. అయితే ముందు మాకు పెద్దమ్మ దర్శన భాగ్యం కల్పించండి అని వల్లభ అంటాడు. మీరు పూజ చేసి శివయ్యని ఆరాధించండి గాయత్రీ జాడ మీకు తెలుస్తుంది అని గురువుగారు అంటారు. గురువుగారు ఏమంటున్నారు అని విశాల్ అంటాడు. అవును విశాల్ శివయ్యని ఆరాధించి ఇంటికి తీసుకువస్తే గాయత్రీ జాడ తెలుస్తుంది అని గురువుగారు అంటారు.. దీనితో ఈరోజే ఎపిసోడ్ ముగుస్తుంది