కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత ఆస్థాయి స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ ఉన్న హీరో విజయ్. ఏ సినిమా రీలీజ్ అయినా 100 కోట్ల మార్కు చాలా సులభంగా దాటేస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే విజయ్ ను రాజకీయంగా కూడా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా చేయడం.. వరుస హిట్లు.. సూపర్ స్టార్ ఇమేజ్ విజయ్ ను ఇప్పుడు మరో అచీవ్ మెంట్ సాధించేలా చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలలో తన అభిమానులతో తీసుకున్న ఓ సెల్ఫీ ఇప్పుడు ట్విట్టర్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ట్విట్టర్ ఇండియా దీనిని అధికారికంగా ప్రకటించడం విశేషం.
విడుదలకు సిద్ధంగా ఉన్న ‘మాస్టర్’ సినిమా షూటింగ్ స్పాట్.. నైవేలీ రోడ్ లో తీసుకున్న ఈ సెల్ఫీ రికార్డు రీట్వీట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లోనే బాగా వైరల్ అయింది ఈ ఫొటో. ఇంకేముంది విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోయి షేర్ చేసి విజయ్ ను టాప్ లో కూర్చోబెట్టారు. ఈ సెల్ఫీ ఏకంగా 162.1k రీట్వీట్స్ తో ఇంకా దూసుకుపోతోంది. విజయ్ చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫొటోలో అభిమానుల కేరింతలు, సెల్ ఫోన్ లైటింగ్ తో సందడిగా ఉంది. అందుకే ఈ ఫొటోను విజయ్ ఫ్యాన్స్ టాప్ ట్రెండింగ్ లో ఉంచారు. దీంతో విజయ్ ‘థ్యాంక్స్ నైవేలీ’ అని రాసుకున్నాడు. #ThisHappened2020 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ఇండియా 2020 మోస్ట్ రీట్వీటెడ్ ట్వీట్ ఇన్ ఇండియా అంటూ ఈ సెల్పీని పోస్ట్ చేసింది.
బిగిల్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు 200 కోట్లు పైమాటే. దీంతో విజయ్ ఇల్లు, నిర్మాత, ఫైనాన్షియర్ ఇంటిపై ఏకకాలంలో ఈఏడాది ఫిబ్రవరిలో దాడులు జరిగాయి. ఆ సమయంలో విజయ్ ను ఐటీ అధికారులు విచారణకు కూడా పిలిచారు. ఆ సమయంలో విజయ్ కే ఫ్యాన్స్ నుంచి మద్దతు లభించింది. ఆ విచారణ నుంచి నైవేలీలో జరుగుతున్న మాస్టర్ షూటింగ్ కు వచ్చాడు. అక్కడ గుమిగూడిన ఫ్యాన్స్ తో విజయ్ తీసుకున్న సెల్ఫనే ఇది. ప్రస్తుతం విజయ్ సాధించిన సెల్పీ ఘనతకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!