Gopichand: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ మరికొద్ది రోజుల్లో `భీమా` అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి ఏ. హర్ష దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తే.. వెన్నెల కిషోర్, నాజర్, నరేష్, పూర్ణ, రఘు బాబు ముఖ్య పాత్రలను పోషించారు. మహా శివరాత్రి కానుకగా మార్చి 8న భీమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది.
గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న గోపీచంద్.. భీమా మూవీతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భీమా చిత్రాన్ని తనవంతు గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై భారీ హైప్ పెంచేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ తన గత చిత్రం రామబాణం గురించి ఓ షాకింగ్ మ్యాటర్ ను రివీల్ చేశాడు.
రామబాణం ఫ్లాప్ అవుతుందని గోపీచంద్ కు ముందే తెలుసట. అయినాసరే ఆయన సినిమా చేయడం గమన్నార్హం. శ్రీవాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో గోపిచంద్, డింపుల్ హయాతి జంటగా నటించారు. జగపతి బాబు, ఖుష్భూ, సచిన్ ఖేడేకర్, తరుణ్ అరోరా తదితరులు కీలక పాత్రలను పోషించారు. లక్ష్యం, లౌక్యం హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. 2023 మే 3న భారీ అంచనాల నడుమ విడుదలైన రామబాణం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఇటు నిర్మాతలకు అటు బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. అయితే చాలామంది హీరోలు సినిమా ఫ్లాపైతే దర్శకుడిదే తప్పని నిందిస్తుంటారు. కానీ గోపీచంద్ మాత్రం అందుకు భిన్నం. రామబాణం రిజల్ట్ విషయంలో శ్రీవాస్ తప్పేమి లేదని.. సినిమాలో ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడం వల్లే ఫ్లాప్ అయిందని గోపీచంద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే షూటింగ్ మధ్యలోనే రామబాణం ఫలితమేంటో తనకు అర్థమైందని.. కానీ ఆ టైమ్లో తప్పుకోవడం కరెక్ట్ కాదని భావించే సినిమా చేశానని గోపీచంద్ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మంచి మనసుపై నెటిజన్లు మరియు సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!