Kesineni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరివి అని వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కొడుకు లోకేష్ ను సీఎం చేయాలనే అజెండాతో చంద్రబాబు పని చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో 33వేల ఎకరాలు రైతుల వద్ద తీసుకుని మోసగించాడని దుయ్యబట్టారు. చంద్రబాబు మూటముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నారని, అందుకే సొంతిల్లు కూడా కట్టలేదని అన్నారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో తన మీద గెలుస్తామని మీడియా ముందు కొందరు మాట్లాడుతున్నారనీ, వాళ్లకు ఇదే నా సవాల్ అంటూ.. మూడు లక్షల ఓట్లతో తాను గెలుస్తాననీ, కాల్ మనీ గాళ్లు కాదు బస్తీమే సవాల్ .. దమ్ము, దైర్యం ఉంటే చంద్రబాబే తనపై పోటీకి రావాలని సవాల్ విసిరారు. తనపై చంద్రబాబుకు గెలిచే దమ్ముందా అని కామెంట్స్ చేశారు. నారా లోకేష్ ఒక పనికి మాలినోడు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనవరి మూడో తేదీ చంద్రబాబుకి తిరువూరు నియోజకవర్గం సమాధి కట్టిందన్నారు.
తాను ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మూసుకున్నా, అవమానాలు పడ్డాను అని అన్నారు. సీఎం జగన్ మమ్మల్ని ఆలింగనం చేసుకుని మీలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండాలని ఆహ్వానించారన్నారు.కొన్ని మీడియా సంస్థలు ఏపీ అభివృద్ధి జరగలేదంటూ గొంతు చించుకుంటున్నాయని నాని విమర్శించారు. సీఎం జగన్ నిజమైన అంబేద్కర్ వాది అని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే అదే మానవ అభివృద్ధి అని అన్నారు. మళ్లీ సీఎం జగన్ గెలిస్తేనే పేదవాళ్లందరూ సంతోషంగా ఉంటారని అన్నారు. చంద్రబాబు గెలిస్తే ధనికులు హ్యాపీగా ఉంటారని అన్నారు.
Nitish Kumar: బీహార్ సీఎంగా మరో సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్