తన పై అనర్హత, సపెన్షన్ చర్యలను అడ్డుకోవాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
తాను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని.. యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున ఎన్నికైన్ అతనకు ఈ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదన్నారు. కానీ వైసీపీ ఆ ఎంపీలు అదే కారణం చూపిస్తూ అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని పేర్కొన్నారు.
శుక్రవారం లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను వైఎస్సార్సీపీ ఎంపీలు, న్యాయనిపుణులు కలవనున్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఎంపీలు కోరనున్నారు. ఎంపీలకు స్పీకర్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తున్న హైకోర్ట్ సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది.