సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ కోసం జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. యూఏఈలోని అబుధాబి, దుబాయ్, షార్జాలలో ఇప్పటికే టీంలు ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. అందులో భాగంగానే తాజాగా ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు అబుధాబిలోని షేక్ జయెద్ స్టేడియంలో రాత్రి పూట ఫ్లడ్ లైట్ల వెలుగులో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. అందులో భాగంగా ఆ జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ ఓ భారీ సిక్సర్ కొట్టాడు.
ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ బాదిన ఆ సిక్స్ ఏకంగా 95 మీటర్ల దూరం ప్రయాణించింది. స్టేడియం అవతల రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సుమీద ఆ బంతి పడింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ సిక్స్ కొట్టిన ఆ వీడియోను ముంబై ఇండియన్స్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ అభిమానులే కాదు, క్రికెట్ ప్రియులూ ఆ వీడియోను ఆస్వాదిస్తున్నారు. ఇక ముంబై జట్టు అభిమానులైతే తమ కెప్టెన్ భీభత్సమైన ఫాంలో ఉన్నందుకు సంతోషిస్తున్నారు. రోహిత్ అదే ఫాంను త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీలోనూ కొనసాగించాలని కోరుకుంటున్నారు.
? Batsmen smash sixes
? Legends clear the stadium
? Hitman smashes a six + clears the stadium + hits a moving ?#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @ImRo45 pic.twitter.com/L3Ow1TaDnE— Mumbai Indians (@mipaltan) September 9, 2020
కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ జరగనుంది. అదే రోజు టోర్నీ ప్రారంభమవుతుంది. నవంబర్ 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. అయితే సెమీ ఫైనల్, ఫైనల్ జరిగే స్టేడియాలను మాత్రం బీసీసీఐ ఇంకా ఫిక్స్ చేయలేదు.