తెలుగు, తమిళ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకొని కొనసాగుతున్న హీరోయిన్ నయనతార. నయనతార అంటే ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు గుర్తొస్తాయి. కాంట్రవర్సీ టాపిక్స్ కోకొల్లలు ఉన్నాయి నయనతార విషయంలో. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ కి రాదన్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సినిమా షూటింగ్ లో పాల్గొనేంతవరకే తప్ప అధికంగా పారితోషికం ఇచ్చినా ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనదు.
అందుకు ఒక అద్భుతమైన కారణం కూడా తెలిపింది. అయితే నయన తార కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి తెలుగు, తమిళంలో వరసగా సినిమాలు చేస్తూనే ఉంది తప్ప ఎప్పుడు గ్యాప్ అన్నది రాలేదు. అంతేకాదు నయన నటించిన సినిమాలన్ని దాదాపుగా సక్సస్ కావడం విశేషం. ఇక సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గాను నయన తార పేరు సంపాదించుకుంది. అంతేకాదు స్టార్ హీరోల కోసం డేట్లు కూడా సర్దుబాటు చేయలేంత బిజీగా ఉన్న హీరోయిన్ ఒక్క నయన తార మాత్రమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది నయనతార.
అలాంటిది బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమా విషయంలోను జరిగింది. చెన్నై ఎక్స్ ప్రెస్ షూటింగ్ సమయంలో స్పెషల్ సాంగ్ లో నటించమని నయనతారను అడిగారట. షారుఖ్ ఖాన్ హీరో కాబట్టి ఏ హీరోయిన్ అయినా క్షణం ఆలోచించకుండా సై అంటుంది. కానీ నయన మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పేసింది. అందుకు ఒకటే కారణం. టాప్ హీరోయిన్ గా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న నయన ఇప్పుడు అర్జెంటుగా స్పెషల్ సాంగ్ చేయాల్సిన అవసరం లేదన్న ఉద్దేశ్యమే. ఇక సినిమా సూపర్ హిట్ అయ్యి 100కోట్ల వసూలు చేసింది. కానీ స్పెషల్ సాంగ్ లో నటించిన ప్రియమణికి మాత్రం ఆ పాట ఏమాత్రం ఉపయోగపడలేదు. అంటే నయనతార ఆలోచన సరైనదే కదా. ప్రస్తుతం “కాథు వాకుళ రెండు కాదల్” అనే చిత్రంలో నటిస్తున్న నయనతార, విజయ్ సేతుపతి, సమంత అక్కినేనితో కలసి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతుంది.