Nellore: నెల్లూరులో Nellore: విషాదమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న కు వాలంటీర్లు నెల్లూరులో పడారుపల్లి అనే లాడ్జిలో ప్రాణాలు తీసుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతుల వివరాలు చూస్తే హరీష్ అదేవిధంగా లావణ్యాలు గా పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా వీరు చిట్టమూరు మండలం మెట్టు గ్రామ సచివాలయంలో ఉద్యోగులుగా వీరిని గుర్తించారు.
అంతేకాకుండా మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం ఇవ్వటం జరిగింది. ఇదిలా ఉంటే అసలు వీళ్ళు ఎందుకు మృతి చెందారు ప్రాణాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నదానిపై పోలీసులు తోటి ఉద్యోగస్తులను అదేవిధంగా వీళ్ళ నివాసముండే ప్రాంతాలలో ఆరా తీస్తున్నారు. హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఇద్దరూ శుక్రవారం సచివాలయం విధులకు హాజరు కాలేదు. ఇదే క్రమంలో నెల్లూరు లో నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకోవటం ఇద్దరు కలిసి ఒకే తాడు కి ఉరేసుకుని చనిపోవటం తో రాత్రి అయినా సరే వీళ్ళిద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే వీళ్ళ మృతికి గల కారణం చాలా రోజుల నుండి ప్రేమించుకున్న ట్లు కానీ పెద్దలు మాత్రం పెళ్లికి అంగీకరించినట్లు దీంతో మనస్థాపం చెంది ఇద్దరూ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆల్రెడీ లావణ్యకు మరో వ్యక్తితో పెళ్లి కావడంతో పాటు హరీష్ కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడంతో ఇద్దరు తర్వాత ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోవటంతో మనస్థాపంతో ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.