నిత్యం ఏదో ఒక వివాదంలో నిలుస్తూ వార్తల్లో ఉండే స్వామీజీ నిత్యానంద తాజాగా సంచలనానికి తెరలేపారు. తన భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ ఏకంగా శివుని చూపిస్తానని అంటున్నారు. తనకి తానుగా సొంతంగా కైలాస దేశాన్ని ప్రకటించుకున్న నిత్యానంద మళ్లీ క్రేజీ సంపాదించుకోవడానికి హైలెట్ అవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
తన భక్తులకు శివుని చూడాలనిపిస్తే కైలాస దేశానికి రావాలని పిలుపునిచ్చారు. రెండు రాత్రులు మూడు పగలు తన దేశంలో ఉండే అవకాశం ఇస్తానని, ఈ అవకాశం పొందుకోవాలి అంటే ముందు వీసా కి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భక్తులు తమ సొంత ఖర్చులతో ఆస్ట్రేలియా దేశానికి వస్తే అక్కడి నుండి కైలాస దేశానికి చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్తానని సూచించారు.
ఈ క్రమంలో శివుని చూడాలనుకునే భక్తులు ఈమెయిల్ ద్వారా కైలాస దేశానికి వీసా అప్లై చేసుకోవాలని నిత్యానంద సూచించారు. అయితే ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వారికి ఉచితంగా వీసా ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తనతో వస్తే శివుని దర్శనం డైరెక్టుగా ఉంటుందని నిత్యానంద భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ వస్తున్నాడు. మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో తన భక్తులకు ఈ ఆఫర్ నిత్యానంద ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సర్కిల్స్ లో సంచలనంగా మారింది. కేవలం భక్తుల దగ్గర డబ్బు సంపాదించడం కోసం నిత్యానంద వేస్తున్నా సరికొత్త డ్రామా అని సోషల్ మీడియాలో ఈ వార్తపై నార్మల్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కరోనా దెబ్బకు కలెక్షన్ల తగ్గటంతో ఈ విధంగా నిత్యానంద స్వామి డబ్బులు దండుకోవడానికి సరికొత్త ప్లాన్ వేసినట్లు పేర్కొంటున్నారు.