CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడి వివరాలు తెలియజేస్తే భారీ బహుమతిని ప్రకటించారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్ రోడ్ షో జరుగుతుండగా, సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర సంచలనం అయ్యింది.
సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ వాళ్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. దాడికి సంబంధించి నిందితుల వివరాలు చెప్పిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రకటించారు. సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన వ్యక్తి గురించి ఏదైనా సమాచారం ఉన్నా, తెలిసినా తమకు తెలపాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరారు.
సీఎం జగన్ పై దాడికి సంబంధించి కఛ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు. దాడిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వారు వివరాలను ఫోన్ నెంబర్ లు 9490619342, 9440627089 కు సమాచారం ఇవ్వాలని, వివరాలు తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.
Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట