Malli Nindu Jabili April 15 2024 Episode 623: సరే మాలిని అన్ని మర్చిపోయి ఆనందంగా ఉందాం అని అరవింద్ అంటూ ఉండగా మల్లి వాళ్ళు వస్తారు. చూడండి అత్తయ్య మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి పండగ పూట అందరం ఆనందంగా ఉందాం అని అరవింద్ అంటాడు.కట్ చేస్తే అరవింద్ మాలిని వెళ్లి మల్లి వాళ్ళను రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకువస్తారు. ఎలా ఉన్నావ్ గౌతమ్ అని అరవింద్ కోపంగా తన వంక చూస్తూ ఉంటాడు.బాగానే ఉన్నాను అని గౌతమ్ అంటాడు.బాబు ఈ ఉగాది పండగ రోజు పూజ జరిపించుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అందరు ఆనందాంగా ఉండాలి అని పంతులుగారు అంటారు. నాన్న అందరూ కనిపిస్తున్నారు అమ్మేది అని మల్లి అడుగుతుంది. మీ అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదని పొద్దున్నే వెళ్ళిందమ్మ అని శరత్ అంటాడు.అందరమూ ఆనందంగా ఉన్నాం అమ్మ కూడా ఉంటే బాగుండేది అని మల్లి అంటుంది.
మీ అమ్మ లేకపోతే నే చాలా బాగుంది మల్లి అని వసుంధర అంటుంది.పంతులుగారు ఉగాది పూజ చేస్తారు. అందరి కష్టాలు తీరిపోయి ఈ కొత్త సంవత్సరం రోజునుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అందరూ ఆనందంగా ఉంటారు అంటూ వెళ్లిపోతాడు.హ్యాపీ ఉగాది గౌతమ్ వచ్చే సంవత్సరం నుంచి నీకు పోయినవన్నీ తిరిగి వచ్చి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అరవింద్ అంటాడు. చాలా థాంక్స్ అరవింద్ అని గౌతమ్ అంటాడు. అందరూ ఒకరికి ఒకరు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈ ఉగాది నుంచి మీకు కొత్త శత్రువులు ఉండకూడదని కోరుకుంటున్నాను వదిన అని వసుంధర అంటుంది. మాకు శత్రులంటూ ఎవరూ లేరు కానీ మమ్మల్ని శత్రువులుగా చూస్తారు అని కౌసల్య అంటుంది.
మీరు ఒకరి జీవితంలోకి ఎంటర్ కానంతవరకు ఎవరు శత్రువులు ఉండరు ఒకరి జీవితంలోకి ఎంటర్ అయితే అందరూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు శత్రువులు అని వసుంధర అంటుంది. గౌతమ్ ఇక వెళ్దామా ఎక్కువసేపు ఉంటే భోజనం చేయడానికి గతిలేక వచ్చారనుకుంటుంది వసుంధర అని కౌసల్య అంటుంది. ఇప్పుడు నీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కదా వదినా అలా అననులే అని వసుంధర అంటుంది. అదేంటి ఉగాది రోజు భోజనం చేయకుండా వెళ్ళిపోతారా అందరం ఇక్కడే ఆనందంగా భోజనం చేయాలి అని అరవింద్ పట్టుబడతాడు. మల్లి చానా థాంక్స్ నీ వల్లే ఇంత మందిమి ఆనందంగా ఉన్నాం అని మాలిని అంటుంది. అవును మల్లి ఈరోజు ఈ ఆనందం అంతా నీవల్లే దక్కింది లేదంటే ఉగాది రోజు అందరం ఏడుపులతో ఉండిపోయే వాళ్ళం అని శరత్ అంటాడు.
ఇదంతా దాని గొప్పెనని పొగడకండి అని వసుంధర అంటుంది. అందరం హ్యాపీగా భోజనం చేద్దాం పదండి అని అరవింద్ అంటాడు.కట్ చేస్తే, అంకుల్ మీరందరూ డైనింగ్ టేబుల్ మీద తినండి నేను గౌతమ్ కింద కూర్చుని తింటాం అని అరవింద్ అంటాడు. నా కొడుకు స్థాయి డైనింగ్ టేబుల్ నుంచి కిందికి వచ్చిందని చెప్తున్నావా అరవింద్ అని కౌసల్య అంటుంది. అలా అనడం లేదమ్మా నేను గౌతమ్ పక్కనే కూర్చొని తింటాం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా మాట్లాడుకుంటాం అని అరవింద్ అంటాడు. అరవింద్ బాబు గారు అంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకు అలాగే మీరు కింద కూర్చొని తినండిఅని మల్లి అంటుంది.మలిని మాకు అరిటాకు వేసి భోజనం వడ్డించు అని అరవింద్ అంటాడు.కట్ చేస్తే,మాలిని మల్లి వాళ్ళిద్దరికీ ఇస్తరాకు వేసి వడ్డిస్తారు. శంకరమ్మ డైనింగ్ టేబుల్ మీద అందరికీ భోజనం వడ్డిస్తుంది.ఇక మీరు వెళ్లి అక్కడ కూర్చొని తినండి మల్లి మేమిద్దరం ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ తింటాం అని అరవింద్ అంటాడు. మీరు కింద కూర్చుంటే మేం పైన కూర్చొని ఎలా తింటాం బాబు గారు అని మల్లి అంటుంది. ప్లీజ్ మల్లి అర్థం చేసుకో అని అరవింద్ అనడంతో మాలిని మల్లి వెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారు. తిను గౌతమ్ ఇదే మా ఇంట్లో నీకు ఆఖరి భోజనం అని అంటాడు అరవింద్. అదేంటి అలా ఎందుకన్నావ్ అరవింద్ అని గౌతమ్ అంటాడు. మాలిని స్వీట్ చాలా సూపర్ గా ఉంది అని అరవింద్ అంటాడు. మమ్మీ చేసింది అని మాలిని అంటుంది. అత్తయ్య మీ వంటలు సూపర్ అని అరవింద్ మెచ్చుకుంటాడు. చేయాల్సిందంతా చేసి ఎవరికి ఏమీ తెలియనట్టు భలేగా మేనేజ్ చేస్తున్నావ్ గౌతమ్ నిన్ను నేను ఆరోజు నన్ను కొట్టి చంపేస్తుండగా చూశాను స్టేషన్లో చెప్పింది అబద్ధం
ఇప్పుడు ఇక్కడ చెప్పిందే నిజం ఇది చెప్పడానికే ఇలా ప్లాన్ చేశాను నన్ను చంపాలనుకున్నావు ఊరుకున్నాను నా మాలిని ని విధవరాలని చేసావు కాంప్రమైజ్ అయ్యాను కానీ నా బిడ్డని నాకు లేకుండా దూరం చేసావ్ ఎలా వదిలిపెడతాను అనుకున్నావు గౌతమ్ వేరే వేరే విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యే వాడినేమోఅని అరవింద్ అంటాడు.అరవింద్ అలా అనగానే గౌతమ్ ఒళ్లంతా షేక్ అయిపోయి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఏంటి గౌతమ్ అప్పుడే చెమటలు పట్టేసాయా నువ్వు నా బిడ్డ జోలికి వచ్చావు నిన్ను నేను అస్సలు వదిలిపెట్టను గెట్ రెడీ గౌతమ్ రేపటి నుంచి అందరికీ కొత్త సంవత్సరం నీకు మాత్రం ఈ కొత్త సంవత్సరం నరకంగా మారిపోతుంది రోజు చస్తూ బ్రతుకుతూ నరకాన్ని అనుభవించేలా చేస్తాను అని అరవింద్ అంటాడు… దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది