ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరసగా ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసి ఒక్కొక్కటి ఫినిష్ చేయాలని డిసైడయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ వకీల్ సాబ్ ని కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, క్రిష్, సురేందర్ రెడ్డి ల డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నాడు. అలాగే రీసెంట్ గా బండ్ల గణేష్ నిర్మాతగా కూడా ఒక సినిమా చేయనున్నట్టు మాటిచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో మరో సినిమా కూడా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ఎప్పుడో కొనిపెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఈ రీమేక్ మాత్రం ఇప్పటికి డైలమాలో ఉంది. ఇద్దరు హీరోలు నటించాల్సిన ఈ సినిమాలో హీరోగా రానా ఫిక్స్ అయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించాల్సిన మరో హీరో గురించి పలు వార్తలు వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాని ఇప్పటి వరకు అధికారకంగా ఆ హీరో ఎవరన్నది డిసైడ్ కాలేదు.
ప్రాజెక్ట్ కి రైట్స్ కొన్నప్పుడు బాలకృష్ణ నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తరువాత వెంకటేష్ .. ఆ తర్వాత రవితేజ అని ప్రచారం జరిగింది. కాని అవన్ని గాలి వార్తలే అని తేలిపోయింది. కాగా తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ రీమేక్ కు సంబంధించిన కథలో కొన్ని మార్పులు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి డైలాగ్స్ కూడా రాస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని యంగ్ డైరెక్టర్ కి నిర్మాతలు ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా మొత్తం ఇండియాలో షూట్ చేసేలా సీన్స్ రాసినట్టు తెలుస్తుంది. పక్కా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటే 2 నెలల్లోనే టాకీపార్ట్ కంప్లీట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ‘వకీల్ సాబ్’ తరువాత క్రిష్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలి. అయితే ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేందుకు దాదాపు 4 నెలలు సమయం ఉండటంతో ఈ గ్యాప్ లో ఈ సినిమా చేయమని త్రివిక్రం పవన్ కళ్యాణ్ కి సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో.