మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ను చంపేస్తామంటూ ఫోన్ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ఒకేరోజు ఏడు సార్లు కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ బెదిరింపులు ఎవరు చేసారో, ఎందుకు చేసారో వంటి విషయాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిథ్యం వహించారు. పర్యావరణ, అటవీ, వన్యప్రాణిలో లెజిస్లేటివ్ కమిటీకి తన సేవలు అందించారు కె నాగేశ్వర్. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్ అయిన కె నాగేశ్వర్ రాజకీయ, సామాజిక, సమకాలీన అంశాలపై విశ్లేషణలు చేస్తుంటారు. ఈయన ప్రముఖ మాధ్యమం యూట్యూబ్ లో చాలా ఫేమస్. దాదాపు అన్ని అంశాలపై తన విశ్లేషణ అందించే కె నాగేశ్వర్ కు ఫోన్ బెదిరింపులు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.