తమిళ్ విజయ్ టీవీ ఛానల్ లో ప్రసారమైన ‘పాండియన్ స్టోర్స్’ సిరీస్లో నటించి పాపులర్ అయ్యారు నటి చిత్ర. ఇటీవల ఆమె సూసైడ్ చేసుకున్న విషయం మనకి విదితమే. ఆమె మరణించి ఇప్పటికే దాదాపు వారం రోజుల అవుతుంది. పోలీసులు ఈ రోజు ఉదయం ఆమె భర్త హేమనాథ్ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. డిసెంబర్ 9 వ తేదీ బుధవారం ఉదయం నటి వి.జె.చిత్ర(28) ఉరివేసుకుని మరణించారు. టీవీ సిరీస్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న చిత్రకు రెండు నెలల క్రితం ఒక వ్యాపార వేత్త హేమనాథ్తో నిశ్చితార్ధం జరిగింది. వీరి వివాహం జనవరి నెలలో జరగాల్సి ఉంది. కానీ ఈ ఇద్దరూ అక్టోబర్ 19న రహస్యంగా రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నారట. ఎప్పటిలాగానే చిత్ర ప్రతిరోజు షూటింగ్కు హాజరవుతూ ఉండేవారట.
ప్రస్తుతం ఆమె తన భర్త హేమనాథ్తో ఓ హోటల్లో ఉంటుంది. ఆ రోజు రాత్రి ఒంటి గంట సమయం వరకూ షూటింగ్లో పాల్గొని షూటింగ్ పూర్తిచేసుకుని ఆమె హోటల్ రూమ్ కు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రాత్రి ఆమె భర్త హేమనాథ్ కు చిత్రతో గొడవ జరిగినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసుల విచారణలో కథనం ప్రకారం చిత్ర నటించిన ఓ సీన్ హేమనాథ్కు నచ్చలేదట. దీంతో ఇరువురు గొడవ పడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హేమనాథ్ తన భార్య పై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఆ బాధలో చిత్ర బాత్ రూమ్లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
చిత్ర ముఖంపై రెండు చోట్ల గాయాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు చిత్ర తల్లిదండ్రులు కూడా ఆమె మృతిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు చిత్ర భర్తను అదుపులోకి తీసుకున్నారు.