ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అంతేకాదు 2020 డిసెంబర్ వరకు ఈ సినిమా పూర్తవబోతుందట. గోపికృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపక పదుకొణె నటిస్తుంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతమందించే అవకాశాలున్నాయని సమాచారం.
ఈ రెండు సినిమాలతో పాటు ఆదిపురుష్ టైటిల్ తో మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక రీసెంట్ గా మరో బాలీవుడ్ సీనియ హీరో సైఫ్ అలీఖాన్ లంకేష్ అన్న పాత్రలో నటించబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాని హాలీవుడ్ లోను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా అసాధారణమైన క్రేజ్ ని సాధించిన ప్రభాస్ ప్రస్తుతం కమిటయిన మూడు ప్రాజెక్ట్స్ తో సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ హీరో ఇప్పట్లో సాధించలేని రేంజ్ కి వెళ్ళాడని అంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన బడ్జెట్ 1000 కోట్లకు పైగానే ఉంది.
ఇదిలా ఉంటే దర్శకుడు ఓం రౌత్ సినిమాను 2021 ఆరంభంలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో నాగ్ అశ్విన్ సినిమా విషయంలో రక రకాల రూమర్స్ క్రియోటవుతున్నాయి. ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా పరిస్థితితేంటీ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రెండు సినిమాలను ప్రభాస్ వచ్చే ఏడాది చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
జనవరి 2021 నుండి ఆదిపురుష్ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాకు ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది కాబట్టి. 3 – 4 నెలల షూటింగ్ మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఏడాది పాటు గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందట. ఏప్రిల్ లేదా మే వరకు ఆది పురుష్ ను పూర్తి చేసి వెంటనే నాగ్ అశ్విన్ తో సెట్స్ మీదకి వెళ్ళేలా ప్రభాస్ ప్లాన్ చేసినట్టు సమాచారం. రెండు సినిమాలు 2022లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.