PV Sindhu: ఒలంపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది..!! చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో సింధు 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్ లో విజయం సాధించింది.. దీంతో టోక్యో ఒలంపిక్స్ లో సింధుకు 2వ పతకం లభించింది.. 2016 రియో ఒలంపిక్స్ లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.. దాంతో వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది..!!
నిన్న సింధు సెమీస్ లో ఓడిపోయిన తర్వాత తీవ్ర నిరాశలో కూరుకుపోయింది యావత్ భారతావని.. దేశ ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పతకాన్ని సాధించింది.. ఈ మ్యాచ్లో సింధు మొదటినుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించింది సింధు. అద్భుతమైన పోరాటంతో టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, తదితరులు పివి సింధు శుభాకాంక్షలు తెలియజేశారు..