“బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన “సాహో” సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన అట్టర్ ఫ్లాప్ అవ్వటం ప్రభాస్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. కాగా “సాహో” సినిమా చేస్తున్న సమయంలోనే ప్రభాస్ “రాధేశ్యామ్” స్టోరీ ఓకే చేయడం అందరికీ తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గత ఏడాది అక్టోబర్ మాసం నుండి ప్రారంభం కాగా మొన్నటి వరకూ ఈ సినిమా వివరాలు ఏది కూడా బయటికి రాలేదు.
దీంతో ప్రభాస్ అభిమానుల అసలు ప్రభాస్ సినిమా చేస్తున్నాడా లేదా అన్న సందేహంతో ఉన్న సమయంలో సినిమా యూనిట్ పై విమర్శలు భయంకరంగా రావటంతో..సినిమా యూనిట్ వెంటనే “రాధేశ్యామ్” టైటిల్ తో పాటు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల పూజా హెగ్డే పుట్టిన రోజు నాడు ఆమెకు సంబంధించిన పిక్ కూడా రిలీజ్ చేశారు.
ఇదే తరుణంలో ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు నాడు కూడా.. ప్రభాస్ కి సంబంధించిన ఫోటోని “బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్” పేరిట రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలక విషయాలు సచిన్ కెడ్కర్ వివరించారు. ఈ చిత్ర కథ అనేది సైన్స్ కి మరియు జ్యోతిష్యానికి మద్య సాగుతుంది అని వివరించారు. ఈ చిత్ర కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని తెలిపారు. అయితే ఈ చిత్రంలో తను డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు.