హైదరాబాదు, జనవరి 17: పంతం ప్రకారం బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరుకాలేదు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119మంది సభ్యుల ఉండగా, గురువారం 114మంది ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ఆ సీటులో ఉండగా ప్రమాణ స్వీకారం చేయనని తెలంగాణలో ఎకైక బిజెపి ఎమ్మెల్యే, హిందూత్వవాది రాజాసింగ్ ముందుగానే ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే నేడు కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు.
అక్బరుద్దీన్ ఒవైసి, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట వీరయ్యలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే వీరు వ్యక్తిగత కారణాల వల్ల సభకు రాలేకపోయినట్లు సమాచారం