రానా దగ్గుబాటి బాహుబలి సినిమాకంటే ముందుగానే సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో క్రేజ్ ని సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, ఇతర భాషల్లో సాధించిన బాహుబలి ఫ్రాంఛైజీ తో పాన్ ఇండియా స్టార్గా మారాడు. రానా బాలీవుడ్ లో నటించిన ‘హౌస్ఫుల్ 4’ బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా తెలుగులో ‘అరణ్య’ పేరుతో విడుదలవుతున్న బహు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరణ్య’ బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుండటం విశేషం. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కాని అనివార్యకారణాల వల్ల రిలీజ్ చేయాలనుకున్న ప్రతీసారి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు డేట్ లాకయింది.
తాజాగా ఆవిష్కరించిన ‘అరణ్య’ పోస్టర్, మోషన్ వీడియో ద్వారా ఈ సినిమా 2021 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు. ఇక 25 సంవత్సరాలుగా అరణ్యంలో జీవిస్తున్న ఒక మనిషి కథే ‘అరణ్య’ సినిమా అని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన అరణ్య టీజర్కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెల్సిందే.
ఈ సినిమాతో పాటు మరో విరాట పర్వం అన్న సినిమాలోను రానా నటించిన సంగతి తెలిసిందే. బ్యాలెన్స్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేందుకు ఇటీవలే చిత్రీకరణ పారంభించారు మేకర్స్. కాగా రానా నుంచి సంక్రాంతి బరిలో ‘అరణ్య’ దిగుతుండగా వెంకటేష్ నటిస్తున్న నారప్ప పరిస్థితేంటి అని అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అయితే నారప్ప ఇంకా చాలా సినిమా చిత్రీకరణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో సంక్రాంతికి బరిలో దిగడం అసాధ్యం అని తెలుస్తుంది.