అమరావతి: ఏపి అసెంబ్లీ ముట్టడికి రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు సోమవారం ప్రయత్నించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. 40 మంది విద్యార్థులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
రాయలసీమ నుండి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరూ అసెంబ్లీలో తమ డిమాండ్లపై మాట్లాడటం లేదంటూ విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనీ, రాజధానిగా అభివృద్ధి చేయాలనీ వారు నినాదాలు చేశారు.